ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్బుక్) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎక్స్ (ట్విటర్) తరహాలో మెటా , ఇన్స్టాగ్రామ్ ను వినియోగించుకోవాలంటే నెలవారి సబ్స్ర్కిప్షన్ చెల్లించేలా కొత్త చెల్లింపు పద్ధతిని అమలు చేయనుందట. అయితే ఈ సబ్స్ర్కిప్షన్ విధానం యాడ్స్ వద్దనుకునే యూజర్లు మాత్రమే నెలవారి చొప్పున కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.
ఇప్పటికే యూరప్ దేశాలకు చెందిన మెటా, ఇన్స్టాగ్రామ్ యూసర్లు నుంచి యాడ్స్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ పేరుతో మెటా నెలకు రూ.1,165 వసూలు చేస్తుంది. మరి ఆసియా దేశాల్లో అతిపెద్ద సోషల్ మీడియా మార్కెట్ గా కొనసాగుతున్న భారత్లోని యూజర్లకు ఈ సబ్స్ర్కిప్షన్ విధానం ఉంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే భద్రత దృష్ట్యా భారత్ యాడ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ కు అనుమతి ఇవ్వనుందని అంచనాలు నెలకున్నాయి.
పలు నివేదికల ప్రకారం.. డెస్క్ టాప్ పరికిరాలలో ప్రకటనలు లేకుండా మెటా లేదా ఇన్స్టాగ్రామ్ యూజర్స్ చేయాలనుకునే వినియోగదారుల నెలకు 10.46$ కు సమానమైన సుమారు 10 యారోల సబ్స్ర్కిప్షన్ ఫీజును వసూలు చేయాలని మెటా ఆలోచిస్తాంది. ఒకటి కంటే ఎక్కువ సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటే వారి వద్ద నుంచి ఒక్కో ఖాతాకు దాదాపు 6 యూరోల అదనపు ఛర్జీని విదించవచ్చు. మొబైల్ యూజర్ల సబ్స్ర్కిప్షన్ ధర నెలకు దాదాపు 13 యూరోలకు పెరగవచ్చని అంచనా.