ఇటీవల చంద్రబాబు అరెస్ట్ అవడంతో ఆంధ్ర ప్రదేశ్ మొత్తం గందరగోళ వాతావరణం నెలకొంది. ఇక ఎప్పటికప్పుడు నచ్చని వ్యక్తులను టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రామ్ గోపాల్ వర్మ కు మంచి అవకాశం దొరికినట్లు అయింది. దొరికిందే సందని పవన్ కళ్యాణ్, చంద్రబాబు పై సెటైరికల్ కౌంటర్స్ వేస్తూ రెచ్చిపోతున్నాడు. ఛాన్స్ దొరికితే చాలు ప్రత్యర్థుల్ని వదిలిపెట్టని ఈ డైరెక్టర్ ఎప్పటికప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అందరికి తెలిసిందే. ఇటీవల పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ ట్విట్ చేసిన ఈ కాంట్రవర్షియల్ డైరెక్టర్ తాజాగా చంద్రబాబుపై మరో ట్వీట్ చేశాడు.
RGV ట్విట్టర్ వేదికగా చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మై నాట్ డియర్ ఏపీ ప్రజలారా 40 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మీకు పగలు రాత్రి సేవ చేసిన వారిని లోపలికి వేసినందుకు బంద్ కి పిలిస్తే ఏమాత్రం కేర్ చేయకుండా మీ పనులు చేసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, షాపింగ్ చేసుకుంటున్నారా.. అవ్వ.. ఇంతకన్నా వెన్నుపోటు ఉంటుందా అంటూ రాసుకొచ్చాడు.
అంటే అవినీతి రాజకీయ నాయకుడు కాబట్టే ఏపీ ప్రజలు అసలు పట్టించుకోకుండా తమ పనులు తాము బిజీగా ఉన్నారు అంటూ వెటకారంగా కామెంట్స్ చినట్లు అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పవన్ ఫ్యాన్స్ తో పాటు టిడిపి అభిమానులు కూడా ఆర్జీవి పై మండిపడుతున్నారు బండ బూతులు తిడుతున్నారు. అయినా ఆర్జీవికి ఇటువంటివన్నీ చాలా కామన్ అయిపోయాయి. ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలతో తిట్టించుకుంటూనే ఉంటాడు. అయినా అతడి విధానం మాత్రం మార్చుకోవడం లేదు.