ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ” దేవర ” సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఆచార్య ప్లాప్ కావడంతో ఈ సినిమాతో ఎలాగైనా హీట్ తన ఖాతాలో వేసుకోవాలని కసితో ఉన్నాడు కొరటాల. అలాగే ఆర్ఆర్ఆర్ తరువాత వస్తున్న మరో పాన్ ఇండియా లెవెల్ సినిమా కావడంతో ఎన్టీఆర్ కూడా ఈ సినిమాకు ఎంతగానో కష్టపడుతున్నాడు.
శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా సముద్రనేపద్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సముద్రంలో భయానక వాతావరణం కూడా క్రియేట్ చేస్తూ ఓ సీక్వెన్స్ తీస్తున్నారని న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎంటా సీక్వెన్స్ అనుకుంటున్నారా ఓ భయంకరమైన సునామీ సీక్వెన్స్.. దాని కొరటాల బాగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాడట. పైగా ఈ సీక్వెన్స్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నారని తెలుస్తుంది.
దేవర సినిమాను దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందిస్తుండగా.. కొరటాల శివ ఎలాంటి ఎలిమెంట్స్ రాశాడో ఇంకా చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ – కొరటాల కలయిక అంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలిసిందే. పైగా ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ పెద్ద హిట్ కావడంతో ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.