ఏఎన్నార్ విగ్రహావిష్కరణలో జయసుధ ఎవరిని కలిసింది? అది వారేనా?

ఏఎన్నార్ శతజయంతి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సహజనటి జయసుధ చాలా స్పెషల్ గా కనిపించారు. ఇక జయసుధ – ఏఎన్నార్ కాంబోలో వచ్చిన సినిమాల గురించి అందరికీ తెలిసినదే. ప్రేమాభిషేకం, మేఘసందేశం లాంటి మెమొరబుల్ చిత్రాల్లో నటించింది ఆమె. కాగా తెలుగు నటనా శిఖరం అక్కినేని నాగేశ్వర రావు శతజయంతి నేటి నుంచి మొదలైంది. దీనితో ఏఎన్నార్ తనయుడు, కింగ్ నాగార్జున తన తండ్రి శతజయంతి ఉత్సవాలని వైభవంగా నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నారు. దాంతో అన్నపూర్ణ స్టూడియోస్ లో తాజాగా ఏఎన్నార్ విగ్రహావిష్కరణతో శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఏఎన్నార్ పంచలోహ విగ్రహావిష్కరణ వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది.

ఇక ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి రాజకీయ ప్రముఖుల వరకూ అతిరథ మహారథులంతా హాజరయ్యారు. ఈ నపధ్యంలో మహేష్ బాబు, రాంచరణ్, మోహన్ బాబు, రాజమౌళి, కీరవాణి, బ్రహ్మానందం, జయసుధ, నాని, సురేష్ బాబు ఇంకా పలువురు ప్రముఖులు హాజరు కావడం జరిగింది. బాలీవుడ్ నుంచి సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ క్రయక్రమానికి హాజరు కావడం విశేషం.

అయితే ఏఎన్నార్ శతజయంతి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సహజనటి జయసుధ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జయసుధ ఏఎన్నార్ తో కలసి ప్రేమాభిషేకం, మేఘసందేశం లాంటి మెమొరబుల్ చిత్రాల్లో నటించిన విషయం అందరికీ విదితమే. అయితే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జయసుధ వ్యక్తిగత జీవితం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. జయసుధ ఈ ఈవెంట్ లో మరోసారి తన కొత్త ప్రియుడితో కనిపించింది అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.