తల్లికి క్యాన్సర్ అని చెప్పి.. స్టేజ్ పైనే గుక్క పెట్టి ఏడ్చేసిన ఆ స్టార్ హీరోయిన్..!!

కోలీవుడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ వరల్డ్ రోజ్ డే సందర్భంగా క్యాన్సర్ పేషెంట్స్ తో ఇంట్రాక్ట్ అయింది. ఈ క్రమంలో స్టేజ్ పైనే ఏడ్చేసింది. తన తల్లికి గత ఏడాది క్యాన్సర్ నిర్ధారణ అయిందని.. అప్పుడు తనను కూడా టెస్ట్ చేయించుకోమని డాక్టర్స్ సూచించారని చెప్పింది.

అమ్మ సిక్ అయినా ప్రతిసారి భయమేస్తుందని.. కానీ అవన్నీ బయటకు కనిపించకుండా త్వరగా కోలుకుంటుందనే భరోసా ఇస్తామని తెలిపింది. తనను కాపాడుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు అయినా చేస్తామన్న ప్రియా… పేషెంట్స్ అందరూ డాక్టర్స్ పై నమ్మకం ఉంచాలని, కచ్చితంగా రికవరీ అవుతుందని మోటివేట్ చేసింది.

ఆ తర్వాత క్యాన్సర్ తో బాధపడుతున్న వారిని హగ్ చేసుకుని ధైర్యం చెప్పింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమెది ఎంత గొప్ప మనసు అంటూ.. ప్రశంసిస్తున్నారు అభిమానులు. త్వరలోనే మీ అమ్మగారికి క్యూర్ అవుతుంది ఏమీ బాధపడకండి.. మీలాంటి మంచి మనసు ఉన్న వారికి ఎప్పుడూ మేలే జరుగుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.