సనాతన ధర్మాన్ని తొలగించాలని తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన సంచల వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. స్టాలిన్ కొడుకు వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, హిందూ సంఘాలు, సాధువులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతుంది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు సపోర్ట్ చేస్తూ కొందరు.. మరికొందరు సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే సనాతన ధర్మంపై గతంలో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ చేసిన ఒక పోస్ట్ కూడా ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ పాత ట్వీట్తో తన తల్లి సురేఖ ఇంట్లో తులసి కోట వద్ద పూజ చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ మన సనాతన ధర్మాన్ని మనమే రక్షించుకోవడం మనందరి బాధ్యత అని అందులో రాసుకు వచ్చాడు.
2020 సెప్టెంబర్ లో రామ్ చరణ్ ఈ పోస్ట్ పెట్టాడు.. తాజాగా జరుగుతున్న ఈ రచ్చలో మరోసారి ఈ పోస్ట్ వైరల్గా మారింది. రామ్ చరణ్ ని చూసి ఉదయనిధి స్టాలిన్ బుద్ధి తెచ్చుకోవాలంటూ నెటిజెన్లు ఆ పోస్టును వైరల్ చేస్తున్నారు.
మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి భాధ్యత…. #Bharathiya_Culture_Matters pic.twitter.com/Mi5Bl3k8nY
— Ram Charan (@AlwaysRamCharan) September 11, 2020