కోలీవుడ్ తలైవా రజినీకాంత్ ఇటీవల జైలర్ సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాతో భారీ రికార్డులు సృష్టించిన.. రజిని పొలిటికల్ ఎంట్రీ పై ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రజనీకాంత్ గవర్నర్ కాబోతున్నారని ప్రచారం ఎప్పటికప్పుడు తెరపైకి వస్తూనే ఉంది. జైలర్ సక్సెస్ అయిన తరువాతనే బిజెపి సీఎం యోగి కాళ్లపై పడి ఆశీస్సులు తీసుకోవడం బిజెపి మద్దతుగా గతంలో కొన్ని కామెంట్లు చేయడం ప్రస్తుతం చర్చినీయ అంశంగా మారింది.
ఇక రజిని గవర్నర్ కాబోతున్నాడు అంటూ జరిగే ప్రచారంపై సోదరుడు సత్యనారాయణ కొన్ని కామెంట్స్ చేశాడు. రజనీకి గవర్నర్ పదవి దేవుడి చేతుల్లో ఉందని ఊహాగానాలకు మరింత ఆజ్యం పోశాడు. ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోకి మాత్రం రజిని రారంటూ కుండబద్దలు కొట్టాడు. తాజాగా మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న సత్యనారాయణ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశాడు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వన్తో రజనీకాంత్ మీటింగ్కి ఎలాంటి రాజకీయ సంబంధం లేదని రజనీకి గవర్నర్ పదవి మాత్రం దేవుడు చేతుల్లోనే ఉందంటు చెప్పుకొచ్చాడు.
ఇటీవల ఉత్తర భారతదేశంలో పర్యటించిన రజనీకాంత్ యుపి సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్, జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో కలవడం మనం చూసాం. దీంతో రజినీకాంత్ గవర్నర్ పదవి అంశం మళ్ళీ చర్చినీయ అంశం అయింది. ఈ క్రమంలో మీడియా ప్రశ్నలకు స్పందించిన సత్యనారాయణ రజనీకి గవర్నర్ పదవి రావాలని ఎలాంటి ఆశలు పెట్టుకోలేదని.. ఒకవేళ వస్తే మాత్రం సంతోషిస్తానని అన్నాడు. దీంతో రజిని సైతం గవర్నర్ పదవి వస్తే రిజెక్ట్ చేయడని అంశం అర్థం అయిపోయింది. ఇక సత్యనారాయణ చెప్పిన ఈ మాటలు వింటుంటే రజిని గవర్నర్ పదవి దక్కించుకోవడం ఖాయం అనే ప్రచారం జరుగుతుంది.