యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తుంది. బాలీవుడ్ పవర్ ఫుల్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ప్రధాన ప్రతినాయకుడిగా ఈ సినిమాలో నటిస్తున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ కొంతకాలం క్రితం షూటింగ్ ప్రారంభించింది. ఇక పోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా చాలా భాగం వరకు వాటర్ లో ఉండబోతుంది.
అలానే ఇందులో చాలా యాక్షన్స్ సనివేశాలు కూడా వాటర్ పై ఉండబోతున్నట్లు సమాచారం. సముద్ర నేపథ్యంలో తరికెక్కుతున్న ఈ సినిమాలో అండర్ వాటర్ యాక్షన్స్ సీన్ల కోసం ముంబైలో కొన్ని రోజులు ఎన్టీఆర్ ప్రత్యేక శిక్షణ తీసుకొని.. భారీ యాక్షన్ సన్నివేశంలో ఇప్పటికే నటించినట్లు సమాచారం. ఆ యాక్షన్ సీన్ మూవీకి హైలెట్ కాబోతుందట. ఇకపోతే ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది.
ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ బజ్ వైరల్ అవుతుంది. ఈ మూవీ యొక్క ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ఫామ్లో ఒకటి అయిన నెట్ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ హక్కులను ఏకంగా రూ.80 కోట్లకు కొనుగోలు చేసిందట నెట్ఫ్లిక్స్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.