అక్కినేని నాగార్జున గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల తాజాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ప్రస్తుతం మాస్ యాక్షన్ మూవీ నా సామి రంగ సినిమాలో నటిస్తున్నాడు. డాన్స్ డైరెక్టర్ విజయ బన్నీ తొలిసారిగా మెగా ఫోన్ పడుతూ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.
శ్రీనివాస్ చిట్టూరి ప్రొడ్యూసర్ గా, ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడిగా మాస్ యాక్షన్ రెస్ట్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతుంది ఈ మూవీలో పలాస, శ్రీదేవి సోడా సెంటర్ దర్శకుడు కరుణ్ కుమార్ నెగిటివ్ రోల్ లో నటించబోతున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అన్ని సోషల్ మీడియాలో వైరెల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా అశీకా రంగనాథ్, మానస వర్షిని ల పేర్లని టీం చూస్తున్నట్లు సమాచారం. వీరిద్దరి తాజా లుక్ టెస్ట్ కూడా చేశారట. మూవీ టీం త్వరలో ఇద్దరిలో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం ఉంది. కాగా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ఇటీవల రిలీజై మంచి రెస్పాన్స్ సాధించాయి. త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు ముగించి వచ్చేయడాది సంక్రాంతి కానుక సినిమాను రిలీజ్ చేస్తారని సినీ వర్గల నుండి టాక్ వినిపిస్తుంది.