రాఖి కట్టేందుకు మంచి సమయం ఇదే…..!!

భారతీయ పండగల్లో ఒక్కో పండగకు ఒక ప్రత్యేకత ఉంటుంది. రాఖీ పండగ ప్రతి ఏడాది శ్రావణమాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. కానీ ఏడాది అధిక శ్రావణ మాసాలు రావడంతో… ఈ విషయమైతే రాఖీ పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలని ప్రశ్నాకరంగా మారింది. పౌర్ణమి ఘడియలు ఉన్న సమయంలోనే సోదరులకు రాఖీ కట్టాలి. కానీ ఈ ఏడాది మాత్రం పౌర్ణమి ఏ రోజు జరుపుకోవాలి అనే సందేహం ఉంది. రాఖీ పండగ ఈ నెల 30నా, 31.. ? ఈ ఏడాది పౌర్ణమి రెండు రోజుల్లో వచ్చింది. రాఖీ ఎప్పుడు కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పండగ జరుపుకోవాలి. ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణమి ఘడియలు ఈ నెల 30 ఉదయం 10:59 నుంచి ప్రారంభమై 31 ఉదయం 7:05 వరకు పౌర్ణమి ఘడియలు ఉంటాయి. అయితే 30వ తేదీ ఉదయం 10.59 గంటల నుంచి రాత్రి 9.02 గంటల వరకు భద్రకాలం ఉందని పంచాంగ కర్తలు చెబుతున్నారు. కనుక ఈ సమయంలో రాఖీ పండుగను జరుపుకోవడం మంచిది కాదు.

అందుకే ఈ భద్ర కాలం ముగిసిన తరువాతే రాఖీ కట్టడం మంచిదని చెబుతున్నారు. ఈనెల 30న పౌర్ణమి ఘడియలు ఉన్నప్పటికీ రాత్రి 9.02 వరకు భద్రకాలం ఉందట. భద్రకాలంలో రాఖీని అసలు కట్టకూడదు.
అలా కడితే దోషాలు, జరక్కూడని పరిణామాలు ఎదురు అవుతాయి. అక్కా తమ్ముళ్లు ఈ పండగ రోజున తన ప్రేమానురాగాలను పంచుతారు. అక్కాచెల్లెళ్లు తన అన్నదమ్ములు బాగుండాలని రక్షాబంధన్ కడతారు. ఎల్లప్పుడూ వాళ్లకి తోడుగా ఉంటారని నమ్ముతూ ఉంటారు. అసలు భద్ర కాలం అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సూర్యుడు కుమార్తె భద్ర. అంటే శనిదేవుడి సోదరి. శని స్వరూపంలానే భద్ర కూడా కఠినంగా ఉంటుందట. భద్ర సమస్త ప్రపంచాన్ని తన స్వరూపంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుందట. అంటే పనులు అడ్డుకోవడం, శుభకార్యాలు అడ్డుకోవడం, కీడు తలపెట్టడం వంటి సమస్యలను ఎదురు చేస్తుందట. భద్ర నిత్యం ముల్లోకాలను సంచరిస్తుంటుందని… ఆమె ఎక్కడుంటే అక్కడే శుభకార్యాలు జరగవని అందుకే భద్రకాలం అంటే చాలా ప్రమాదకరం అని భావిస్తారు. అందుకే భద్రకాలంలో శుభకార్యాలని వాయిదా వేస్తారు. అలాగే రాఖీ పండగ కూడా భద్రకాలంలో రావడం వల్ల సరైన గడియలు చూసి సమయాన్ని తెలిపారు.