పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, ప్రశాంత్నీల్ డైరెక్షన్లో మాస్, యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న సినిమా సలార్. రెండు పార్ట్లుగా ఈ మూవీ రానున్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. షూటింగ్ తర్వాత కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాగా ట్రైలర్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ టీం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారట.
సినిమాలో యాక్ట్ చేసిన నటీనటులు ఎవరు ఏ మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వకూడదని ఆదేశాలు పంపినట్లు తెలుస్తుంది. ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్, వెబ్సైట్, పత్రికలు, టెలివిజన్ ఛానల్ ఇలా ఏ సమాజిక మాధ్యమాలలో ఎవరు ఇంటర్వ్యూలో పాల్గొనకూడదట. ఇప్పటికే సలార్ పై అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టైంలో నటీనటులు సినిమాల గురించి మాట్లాడితే అవి మరింత వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అత్యుత్సాహంతో పొరపాటున ఎవరైనా స్టోరీ లేని చెపేసె అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ‘ సలార్ 1’ లో శృతిహాసన్ హీరోయిన్. పృథ్వీరాజ్, సుకుమారన్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు. జగపతిబాబు కీరోల్లో కనిపించబోతున్నాడు. సెప్టెంబర్ 28న సలార్ ప్రేక్షకుల ముందుకి రానుంది.