ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అమీషా పటేల్. పవన్ కళ్యాణ్ తో బద్రి, జూనియర్ ఎన్టీఆర్ తో నరసింహుడు లాంటి హిట్ సినిమాల్లో నటించిన అమీషా ప్రస్తుతం సినిమాలు లేక అవకాశాల కోసం హాట్ ఫోటో షూట్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఇటీవల అమీషా పటేల్ గద్దర్ టు సినిమాతో అవకాశం దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలై హిట్ టాక్ సంపాదించింది.
ముఖ్యంగా అమేజా పటేల్ పాత్ర ఇందులో బాగా హైలైట్ అయింది. దీంతో ఇప్పుడు అమేషా పటేల్ కు హిందీలో మళ్లీ క్రేజ్ మొదలైంది. మొత్తానికి లేటు వయసులో అమేషాకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఆఫర్లకు తగ్గట్టుగా బోల్డ్ సీన్లలో నటించడానికి ఏమాత్రం తగ్గకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఈ హట్ బ్యూటి. ఇక ప్రస్తుతం ఎటువంటి సినిమాల్లో అవకాశాలు లేని అమేషాకు గద్దర్ 2తో ఓటిటి ప్రపంచంలో మంచి డిమాండ్ వచ్చేలా కనిపిస్తుంది. గతంలో అమేష పటేల్ కహో నా ప్యార్ హై గద్దర్ ఏక్ ప్రేమ్ కధ బద్రి లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.
ఓ సినిమా ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన అమేషా ఓ వ్యక్తి దగ్గర రూ2.5 కోట్లను అప్పుగా తీసుకుంది. తన డబ్బు తనకు తిరిగి ఇవ్వలేదని అతడు కోర్ట్ని ఆశ్రయించడంతో కోర్టు ఆమెపై అరెస్టు వారెంట్ కూడా ఇచ్చింది. మొత్తం మీద చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కున్న అమేజా పటేల్ రాంచీ సివిల్ కోర్టులో లొంగిపోయింది. ఇప్పటికీ ఆమెపై ఆ కేసు నడుస్తూనే ఉంది. అయితే ఈ లేటు వయసులో అమేషాకి ఘాటు ఆఫర్లు లైన్ కట్టడంతో ప్రస్తుతం నేను సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.