మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమా టాలీవుడ్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిందో అందరికీ తెలిసిన విషయమే. కళ్ళు చేదురే స్థాయిలో కలెక్షన్ తెచ్చిపెట్టిన ఈ సినిమాలో ఓ సనివేశంలో చిరంజీవి నటించారు. కాని ఆ సీన్లో అచ్చంగా చిరంజీవి నటించలేదట. చిరంజీవి డేట్స్ కుదరకపోవడంతో ఒక కమెడియన్ చిరంజీవి పాత్రలు నటించారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఎంతో కాలం నుంచో స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ శ్రీను ఈ సినిమాలో చిరంజీవి డూప్ గా నటించారట. చిరంజీవి గారికి డూప్గా చేయడం అంటే చాలా పెద్ద అదృష్టమని ప్రభాస్ శ్రీను స్వయంగా వివరించారు. అప్పట్లో ప్రభాస్ గారి ఇంట్లో రాత్రి 3 గంటల వరకు వాలీబాల్ ఆడే వాళ్ళమని ఆయన చెప్పుకొచ్చాడు.
ఆ టైంలో రాజమౌళి ఫోన్ చేసి నాకు ఆ ఆఫర్ ఇచ్చారని ఆ సినిమాలోని నాడ్రస్ చిరంజీవి గారు వేసుకున్న డ్రెస్ ఒకటే అని ప్రభాస్ శ్రీను పేర్కొన్నాడు. ఆ డ్రస్ తర్వాత దొరకలేదని ప్రభాస్ శ్రీను చేసిన కామెంట్స్.. చిరంజీవి డూపుగా అతని అనుభవాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ శ్రీను స్టార్ కమెడియన్గా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నాడట.