ఓటీటీలో మరో కొత్త షోకి శ్రీ‌కారం చుట్టిన‌ బాలయ్య.. ఈసారీ ఎంట‌ర్‌టైన్మెంట్ డ‌బుల్‌..!!

అన్‌స్టాపబుల్‌షోతో బాలయ్య ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఈ షో తర్వాత ఓటీటీలో బాలయ్య మరో షో చేయబోతున్నట్లు తెలుస్తుంది. అన్‌స్టాపబుల్‌షోతో ఓటీటీకి ఎంట్రీ ఇచ్చాడు బాలయ్య. ఈ షో ప్రారంభంలో ఎన్నో విమర్శలొచ్చాయి‌. హోస్ట్‌గా బాలయ్య సక్సెస్ కాలేడని ఎన్నో క‌మెంట్స్ వ‌చ్చాయి. కానీ అందరూ నోర్లు మోయించేలా అన్‌స్టాపబుల్‌షోనీ బిగ్గెస్ట్ సక్సెస్‌గా నిలబెట్టాడు బాలయ్య. టాప్ రేటెడ్ తెలుగు టాక్‌షోలలో ఒకటిగా ఈ షో నిలిచింది.

అన్‌స్టాపబుల్ సీజన్ 1తో పాటుగా సీజన్ 2 లో తనదైన స్టైల్‌లో జోక్స్, ప్రాసలతో కామెడీ ఎంటర్టైనర్ గా బాలయ్య సీజన్ 2 ను కూడా సక్సెస్ చేశాడు. సెలబ్రెటీలను ఆయన ప్రశ్నలు అడిగిన తీరుపై ప్రశంసలు కురిశాయి. అన్‌స్టాపబుల్ సక్సెస్ నేపథ్యంలో ఓటీటీలో మరోషోని ప్రారంభిస్తున్నాడట బాల‌య్య‌. ఇప్పటివరకు తెలుగులో వచ్చిన రియాలిటీ షోలకు భిన్నంగా ఫుల్ ఎంటర్‌టైన‌ర్‌గా ఈషో ఉండ‌మోతుంద‌ట‌.

అన్‌స్టాపబుల్ చేసిన ఆహా ఓటీటి సంస్థ వారు బాలయ్య కొత్త షోను ప్రొడ్యూస్ చెయ్యబోతున్నారట. భగవంత్ కేసరి సినిమా తరువాత ఈ ఓటీటీ షో కోసం బాలయ్య డేట్స్ కేటాయించునున్నాడని తెలుస్తుంది. త్వరలోనే ఈ షో కి సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.