తెలుగు సినీ ఇండస్ట్రీలో అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది హీరోయిన్ అభినయ. శ్రీకాంత్ హీరోగా డైరెక్టర్ సత్తిబాబు దర్శకత్వంలో వచ్చిన ఒట్టేసి చెబుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత రవితేజ, భూమిక కలిసిన నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీ చిత్రంలో కూడా మరొకసారి ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోవడంతో మలయాళం ఇండస్ట్రీలో స్థిరపడిపోయింది.
అలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన కనీహ ఇటీవల తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. ఆమె మోకాలికి ఎక్కువగా గాయం కావడంతో కొద్దిరోజులుగా ఈమె ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నట్లు తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తోంది. తనకాలికి ఏదో ఫ్రాక్చర్ అయినట్టుగా కూడా ఒక ఫోటోను షేర్ చేస్తూ రాసుకొచ్చింది. దీంతో ఈమె త్వరగా కోలుకోవాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. కనిహ అసలు పేరు దివ్య వెంకట సుబ్రహ్మణ్యం. తమిళనాడుకు చెందిన ఈమె 1999లో చదువులు బాగా రాణిస్తూ ఉండేది దీంతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అవార్డు కూడా ప్రకటించింది.
రాజస్థాన్లోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సులో ఈమె మెరిట్ కోట ద్వారా మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది నటన పైన ఇంట్రెస్ట్ తోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టి అప్పుడు తన పేరు కనిహాగా మార్చుకుంది.2002లో ఫైవ్ స్టార్ సినిమా ద్వారా మొదటిసారిగా సినీ రంగప్రవేశం చేసింది. ఇక మలయాళం లో కూడా పలు చిత్రాలలో నటించింది ఆ తర్వాత భాగ్య దేవత, వాజశ్రీ రాజ, స్పిరిట్ సినిమాలలో నటించింది. 2008లో జూన్ 15న శ్యామ్ రాధాకృష్ణను వివాహం చేసుకుంది. వీరికి సాయి రిషి అని కుమారుడు కూడా ఉన్నారు.
View this post on Instagram