పవిత్రతో పెళ్లి.. ఇంత‌కీ మూడో భార్యకు న‌రేష్ ఎంత ముట్ట‌చెప్పాడో తెలుసా?

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ పెళ్లి పీట‌లెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. గ‌త కొద్ది రోజుల నుంచి చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిర‌గ‌డం, ఎక్క‌డికి వెళ్లినా క‌లిసే రావ‌డం వంటి అంశాలు.. వీరిద్ద‌రి బంధంపై అనేక అనుమానాల‌ను రేకెత్తించాయి. క‌ట్ చేస్తే వీర‌ద్ద‌రూ స్వ‌యంగా త‌మ బంధాన్ని బ‌హిర్గ‌తం చేశారు. న్యూ ఇయ‌ర్ రోజు లిప్ లాక్ వీడియోను పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు అనౌన్స్ చేశారు.

న‌రేష్ కు ఇది నాలుగో వివాహం కాగా.. ప‌విత్ర‌కు ఇది మూడో పెళ్లి. నరేష్ వయసు 62 ఏళ్ళు. పవిత్రకు 43 ఏళ్ళు. ఈ వ‌య‌సులో వీరిద్ద‌రూ కొత్త జీవితాన్ని ప్రారంభించ‌బోతున్నారు. న‌రేష్‌ ఇప్పటికే ముచ్చటగా మూడు పెళ్ళిళ్లు చేసుకున్నాడు. టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ఒక సీనియర్ సినిమాటోగ్రాఫర్ కుమార్తెను నరేష్ మొద‌ట వివాహం చేసుకున్నారు. ఆ త‌ర్వాత ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనమరాలైన రేఖ సుప్రియను రెండో వివాహం చేసుకున్నాడు.

వీరిద్ద‌రితో విడిపోయిన త‌ర్వాత రమ్యరఘుపతి ఇష్టపడి మూడో వివాహం చేసుకున్నారు. ఈమెతో కూడా న‌రేష్ ఎక్కువ కాలం క‌లిసి ఉండ‌లేక‌పోయాడు. ఇప్పుడు ప‌విత్ర‌తో నాలుగో పెళ్లికి రెడీ అయ్యాడు. అయితే విడాకులు తీసుకుంటే భార్యకు భర్త భరణం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రమ్యకి నరేష్ ఎంత భరణం చెల్లించాడు అన్న‌ది హాట్ టాపిక్ గా మారింది. సోష‌ల్ మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. రమ్యకు న‌రేష్ రూ. 5 కోట్లు ముట్ట‌చెప్పాడ‌ట‌. ఇద్దరు కుటుంబాలకు సబంధించిన పెద్దలు, లాయర్ల సమక్షంలో ఈ నిర్ణయానికి వచ్చి మేటర్ సెటిల్ చేసుకున్నాడ‌ని, ఆ త‌ర్వాతే ప‌విత్ర‌తో న‌రేష్ పెళ్లిని అనౌన్స్ చేశాడ‌ని టాక్ న‌డుస్తోంది.