గతంలో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ సైతం బాగా ఆకట్టుకున్నప్పటికీ చాలా తక్కువ సమయంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పేసిన వారు చాలామందే ఉన్నారు. కొంతమంది నటీనటులు సైతం ఇప్పుడు ఎలా ఉన్నారో కూడా ఎవరికి తెలియడం లేదు. చాలామంది నటులను మనం మర్చిపోయాము ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ సాక్షి శివానంద్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. ఇక అప్పట్లో తన అందంతో వయ్యారంతో కుర్రకారులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.
చిరంజీవి నటించిన మాస్టర్ సినిమాతో మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమైంది సాక్షి శివానంద్. ఆ తరువాత ఈ అమ్మడు తెలుగులో పలు అవకాశాలు వెళ్ళబడ్డాయి. ఇక అలా చిరంజీవి ,నాగార్జున ,బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో పాటు మహేష్ బాబుతో కూడా నటించింది. తెలుగు ,తమిళ్ ,కన్నడ ,హిందీ వంటి భాషలలో కూడా నటించిన సాక్షి శివానంద్ 2014 తర్వాత పూర్తిగా సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. 1996లో బాలీవుడ్లో మొదటిసారిగా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ 98లో పలు చిత్రాలలో నటించి మంచి క్రేజీ సంపాదించుకుంది. ఆట తర్వాత కొంతకాలం టాలీవుడ్ లో కూడా బాగా తన హవా కొనసాగించింది.
ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ అనుకోకుండా వివాహం చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పింది. రాజశేఖర్ తో సింహరాశి, మోహన్ బాబుతో యమజాతకుడు వంటి సినిమాలలో హీరోయిన్గా నటించింది. అయితే ఇప్పుడు సాక్షి శివానంద్ ను చూస్తే అసలు గుర్తుపట్ట లేకుండా ఉన్నారు అభిమానులు. ముఖ్యంగా ఈమె ఫేసులో అప్పటి అందం లేకపోవడంతో కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాక్షి శివానంద్ హీరోయిన్ స్టేజ్ దాటిపోయిందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
https://twitter.com/CelebrityBorn/status/853115922885648384?s=20&t=23BP8Y83svRXQllDYOtQAA