బాలీవుడ్ నటి రవీనా టాండర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ముఖ్యంగా కే జి ఎఫ్ సినిమాలో నటించి బాగా పాపులర్ అయ్యింది. అయితే ఇప్పుడు రవీనా టాండర్ ఇప్పుడు ఒక వివాదంలో ఇరుక్కున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్లోని టైగర్ సఫారీలో రవీనా టాండర్ పెద్దపులికి అతి సమీపంగా వెళ్లి ఫోటోలు తీయడంపై వివాదం చాలా వైరల్ గా మారుతుంది. సాత్పురా టైగర్ రిజర్వ్ సఫారీ టూర్ లో ఆమె ప్రయాణిస్తున్న వాహనం పులి దగ్గరకు వెళ్లడం పై అక్కడి ప్రభుత్వం.. రవీనా టాండర్ పైన సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా అక్కడి ఫారెస్ట్ అధికారులు కూడా ఈమెకు నోటీసు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.
అసలు విషయంలోకి వెళ్తే నవంబర్ 22న మధ్యప్రదేశ్లోని నర్మదాపురం జిల్లాలో ఉన్న సాత్పురా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ను సందర్శించడానికి వెళ్లిన ఈమె పర్యటనకు సంబంధించి కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. రవీనా వాహనం పులి దగ్గరకు వెళ్ళిన సమయంలో అది చాలా పెద్దగా గాండ్రించడం అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక అంతే కాకుండా ఆమెకు దగ్గరలోనే పులి ఉన్నటువంటి ఒక వీడియోని ఉండడంతో అధికారులు వెంటనే స్పందించారు.
రవీనా షేర్ చేసిన ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారుల దృష్టికి ఈ వీడియో ఫోటోలు వెళ్లడంతో ఈ మేరకు ఆమెకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించి వాహన డ్రైవర్ అక్కడే ఉన్న అధికారులకు కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. సీనియర్ అధికారుల ఆదేశాల మేరకు ఈ ఘటనపై విచారణ ప్రారంభిస్తున్నట్లు ఫారెస్ట్ సబ్ డివిజనల్ ఆఫీసర్ జయరాజ్ సింగ్ చౌహన్ స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతుంది.
Got beautiful shots of sharmilee and her cubs in Tadoba. Wildlife shots are unpredictable due to the unreadable nature of our https://t.co/JQSB9ylxlO tries to be as silent and capture the best moments. Video Shot on Sony Zoom lense 200/400. pic.twitter.com/LsUOn2XtYs
— Raveena Tandon (@TandonRaveena) November 29, 2022