మ‌హేష్ కొడుకు గౌత‌మ్ అందుకే నాయ‌న‌మ్మ అంత్య‌క్రియ‌ల‌కు రాలేదా… అస‌లు నిజం ఇదే…!

సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి సెప్టెంబర్ 28 అనారోగ్య కారణాలతో మరణించింది. ఇందిరా దేవి గత రెండు సంవత్సరాలుగా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. గత సంవత్సరం కృష్ణ పెద్ద కొడుకు మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూడా మరణించాడు. సంవత్సరం లోపే మహేష్ బాబు అమ్మ ఇందిరా దేవి మరణించడంతో ఘట్టమనేని ఫ్యామిలీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆమె పార్థివ దేహం ముందు మహేష్ బాబు కూతురు సితార బాధపడిన విధానం అందరినీ కలిచి వేసింది.

నాన‌మ్మ కోసం వెక్కి వెక్కి ఏడ్చిన సితార (Sitara Ghattamaneni).. కూతురిని ఓదార్చిన మ‌హేష్ (Mahesh Babu) !

సితార‌ బాధపడిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందిరా దేవి చనిపోయినప్పటి నుంచి ఆమె అంత్యక్రియలు పూర్తి అయ్యేయ్యె వరకు అక్కడ మహేష్ బాబు కొడుకు గౌతమ్‌ కనిపించలేదు. మహేష్ బాబు కొడుకు కనిపించకపోవటానికి కారణం ఏంటి ? ఎందుకు రాలేదన్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. గౌతమ్ ప్రస్తుతం ఫారిన్ కంట్రీ లో ఉన్నాడు. కొద్దిరోజుల క్రితమే తన పై చదువులు కోసం ఫారెన్ కంట్రీ కి వెళ్లాడు.

Mahesh Babu And His Wife Namrata And Daughter Sitara Emotional Post On Indira Devi Demise

ఆ కారణంగానే నానమ్మ చనిపోయిన గౌతమ్ రాలేకపోయాడు. దానికి కారణంగానే నాయనమ్మ పార్థివ దేహం వ‌ద్ద‌ సీతార‌ మాత్రమే మనకు కనిపించింది. అయితే మహేష్ బాబు ఇద్దరు పిల్లలు వారి నాయనమ్మ తో చాలా ప్రేమగా ఉంటారు. వాళ్లకి ఎప్పుడు సెలవులు వచ్చినా మహేష్ వాళ్ల‌ను నాయనమ్మ వద్దకు తీసుకువెళ్లేవారు. అందుకే మహేష్ బాబు చిన్న కూతురు సితార నాయనమ్మ పార్థివ దేహం వద్ద అంతలా బాధపడింది. గౌతమ్ కూడా ఉండి ఉంటే ఖ‌చ్చితంగా అంతలా బాధపడే వాడు. విదేశాల్లొ ఉండి పోవడంతో నాయనమ్మ చివరి చూపు కూడా దక్కలేదు.