తన ప్రియుడితో.. దుస్తులకే రూ.3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించిన హీరోయిన్..!!

బాలీవుడ్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్మాండేజ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇక ఈమె ప్రియుడు అయిన సుకేశ్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో రూ.200 కోట్ల రూపాయలు చీటింగ్ కేసులో అరెస్ట్ కావడం జరిగింది. అయితే ఎంతో మంది పారిశ్రామికవేత్తలను వ్యాపారవేత్తల నుంచి సుఖేష్ చంద్ర బలవంతంగా వసూలు చేసినట్టుగా సమాచారం. ఈ కేసు విషయంలోనే జాక్విలిన్ ఫెర్మాండేజ్ పైన తీవ్రమైన ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా పోలీసులు ఈయనను విచారించడం కూడా జరిగింది. జాక్విలిన్ ఫెర్మాండేజ్ తో పాటు నోరా ఫతేహిని విచారించగా ఈమె ప్రమేయం లేదని క్లీన్ చీట్ ఇవ్వడం కూడా జరిగింది.

Jacqueline Fernandez questioned yesterday in Sukesh Chandrashekhar cheating  case, fashion designer Lipakshi also summoned - Edules

అయితే ఈ కేసులో కోట్ల రూపాయలను సుఖేష్ చంద్రశేఖర్ తన ప్రియురాలు అయిన జాక్విలిన్ ఫెర్మాండేజ్ కి ఇచ్చినట్లుగా ఈడి అధికారులు విచారణలో తెలియజేయడం జరిగింది. ఇదంతా ఇలా ఉంటే తాజాగా జాక్విలిన్ ఫెర్మాండేజ్ స్టైలిష్ అయిన లేపాక్షి ఎల్లవాడిని దాదాపుగా 8 గంటలపాటు విచారించగా ఆ విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసినట్లు సమాచారం. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

Sukesh Chandrasekhar alleges Jacqueline Fernandez not telling the truth  after she informs ED that her sister took a loan of $1,50,000 from the  conman: Report | Hindi Movie News - Bollywood - Times of India
హీరోయిన్ జాక్విలిన్ ఫెర్మాండేజ్, సుఖేష్ చంద్ర కొన్ని సంవత్సరాలపాటు సహజీవనం చేశారని..జాక్విలిన్ ఫెర్మాండేజ్ కు కావలసిన వస్తువులను దుస్తులను కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి తనకి ఇచ్చినట్లుగా లేపాక్షి తెలియజేశారు.జాక్విలిన్ ఫెర్మాండేజ్ ను వలలో వేసుకోవడానికి చాలా ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చేవారని తెలియజేశారు. ఇక అందుకు సంబంధించి ట్రాన్సాక్షన్ మొత్తం లేపాక్షి పేరు మీద చేశారని తెలియజేశారు. ఇక దాదాపుగా రూ.3 కోట్ల రూపాయలు విలువైన బ్రాండెడ్ గాల వస్తువులను కూడా కొనిచ్చారని తెలిపారు. ఇక అంతే కాకుండా ముంబైలో రూ.10 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఒక అపార్ట్మెంట్ కూడా తీసుకున్నారని అందులో అప్పుడప్పుడు వెళ్లి కలుస్తూ ఉంటారని తెలియజేశారు లేపాక్షి. ఇక అంతే కాకుండా 7 కోట్లకు పైగా ఆస్తులు కూడా ఉన్నట్లు తెలిపారు. మొత్తంగా 22 కోట్లకు పైగా జాక్విలిన్ ఫెర్మాండేజ్ కు ఇచ్చినట్లు తెలియజేశారు.