ప్రముఖ నటుడిగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , విలన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సమీర్.. మొదటగా బుల్లితెరపైనే తన నట ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత బుల్లితెర మీద బిజీగా ఉన్న సమయంలోనే సినిమాల వైపు రావడం జరిగింది. నిజానికి ఆయన వెండితెరకు రావడానికి కారణం ప్రముఖ ఈటీవీ ఛానల్ వాళ్ళు సమీర్ ను బ్యాన్ చేసి బ్లాక్లిస్టులో పెట్టడమే.. ఇక ఈ కారణం వల్ల ఆయన మళ్లీ బుల్లితెరపై కనిపించకుండా పోయారు అని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని సమీర్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం గమనార్హం.ఈటీవీలో ఎన్నో సీరియల్స్ లో నటించిన సమీర్ దాదాపు నెల మొత్తం ఈటీవీ సీరియల్స్ తోని బిజీగా ఉండేవారు . ముఖ్యంగా శాంతినివాసం సీరియల్ ను ఒక మంచి బ్యానర్ లో కూడా నటించారు సమీర్.. ఈటీవీలో వరుసగా సీరియల్స్ చేస్తున్న సమయంలోనే ఒక కోఆర్టిస్టుతో చనువుగా ఉండి, ఆ అమ్మాయితో ఎఫైర్ నడుపుతున్నాడని ఈటీవీ వారు ఆయనను బ్యాన్ చేశారు. అంతేకాదు ఈటీవీలో వచ్చే ఏ ప్రోగ్రాంలో కూడా సమీర్ నటించకుండా బ్యాన్ విధించి బ్లాక్ లిస్టులో నేమ్ పెట్టడం జరిగింది..ఇక ఇదే విషయంపై స్పందించిన సమీర్ మాట్లాడుతూ.. ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు.. కానీ వారి మాటలు విని సుమన్ నన్ను బ్యాన్ చేశారు . ఒక్కసారి పిలిచి నీ గురించి ఇలాంటి ఫిర్యాదు వస్తోంది అని, నన్ను అడిగి ఉంటే చాలా బాగుండేది.. ఆయన నన్ను ఏమాత్రం వివరణ అడక్కుండా సడన్గా ఇలా నేను చేస్తున్న సినిమాలను ఆపివేశారు. ఇక నన్ను బ్లాక్ లిస్టులో చేస్తున్నట్లు తెలిపారు అంటూ కొంచెం బాధపడ్డారు.
ఇక ” ఈటీవీలోనే సీరియల్స్ చేస్తున్న నేను ఇలా జరగడంతో కట్టాల్సిన లోన్లన్నీ ఒక్కసారిగా అలాగే ఉండిపోయాయి. నెలకు వచ్చే ఆదాయం కూడా పోయింది. ఇక ఈ విషయం చెప్పి ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకోలేదు క. కనీసం నా సన్నిహితుడైన ప్రభాకర్ కి కూడా చెప్పలేదు .మళ్లీ కొన్నాళ్లకు సుమన్ నాతో మాట్లాడి అప్పుడు నీపై తప్పుడు మాటలను విన్నాను అంటూ తెలిపారు.. అయితే ఇక అప్పటి నుంచే వెండి తెరపై నా ప్రయాణం మొదలైందని తెలిపారు.