పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బద్రి సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన రేణు దేశయ్. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్ కళ్యాణ్ రేణుదేశయ్ ప్రేమించుకున్నారు. తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకునే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు తర్వాత అనుకోని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. రేణుదేశయ్ అప్పటినుంచి పిల్లలతో ఒంటరిగానేా ఉంటుంది. పవన్ కళ్యాణ్ తర్వాత ఇంకో పెళ్లి చేసుకున్నాడు. రేణు దేశాయ్ తాజాగా తన పిల్లలు అకిరానంద్, ఆద్యలతో కలిసి స్కాట్ ల్యాండ్ టూర్ కి వెళ్ళింది. అక్కడ ఆమె తన పిల్లలతో ప్రకృతి అందాలను ఆస్వదిస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోనే రేణు దేశాయ్ తన సోషల్ మీడియాలో ఒక ఆస్తికర పోస్ట్ పెట్టింది.
ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఆమె పెట్టిన పోస్ట్ ఏమిటంటే… ‘ప్రతి మనిషికి తన జీవితానికి తోడుగా ఉండే మరో మనిషి అవసరం కావాలి. మీ తోడిని వెతుక్కోవటానికి అన్నా ముందు మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. ఆ తర్వాతే మీకు కావాల్సిన వారిని వెతుక్కోండి’. అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె పెట్టిన పోస్ట్ పై సోషల్ మీడియాలో నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రేణు దేశాయ్ దీంతో రేణుదేశయ్ పెట్టిన పోస్ట్ పైసోషల్ మీడియాలో నెటిజెన్లు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రేణు దేశాయ్ మళ్ళీ ప్రేమలో పడిందా….? రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోబోతుందా….? మళ్లీ రేణు దేశాయ్ పెళ్లి పీటలు ఎక్కబోతుందా…? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదే క్రమంలో రేణు దేశాయ్ 2018లో ఒక వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరిగిందని ఆ వ్యక్తితో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు కూడా వచ్చాయి. ఆ టైంలో పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి తీవ్రమైన వ్యతిరేకత రావటంతో ఆమె ఈ ఆలోచనను మార్చుకుంది. ఆ తర్వాత రేణు దేశయ్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంది. మళ్లీ ఈ పోస్ట్ తో రేణుదేవాయ్ సోషల్ మీడియాలో మంట పెట్టింది. రేణు దేశాయ్ తాజాగా రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. వీటితోపాటు ఆధ్యా అనే లేడీ ఓరియంటెడ్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తుంది.