టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు సినీ వారసత్వాన్ని పుచ్చుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇక ఆయనతో కొన్ని సినిమాలలో నటించిన రమేష్ బాబు హీరోగా కూడా ఒకటి రెండు సినిమాలలో నటించారు. కానీ పెద్దగా ఉన్నత స్థాయికి చేరుకోలేకపోయారు. ఇక ఆ తర్వాత క్రమక్రమంగా ఇండస్ట్రీకి దూరం అవుతూ వచ్చిన ఆయన నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఇటీవల అనారోగ్యం కారణంగా కరోనా సమయంలో మరణించిన విషయం అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ముఖ్యంగా మహేష్ బాబు కూడా కరోనా సోకడంతో తన అన్న అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయారు. ఇకపోతే రమేష్ బాబు వ్యక్తిగత విషయాలు చాలామందికి తెలియవనే చెప్పాలి..
తాజాగా ఆయన కూతురుకి సంబంధించిన ఫోటోలు ఈమధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా బయటకు రావడం గమనార్హం. ఇక ఈ ఫోటోలు చూసిన వారంతా కూడా గ్లామరస్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో కుర్రకారును ఆకర్షిస్తోంది ఈ ముద్దుగుమ్మ అంటూ తెగ పొగిడేస్తున్నారు.. ఈమె పేరు భారతి ఘట్టమనేని.. ఈ అమ్మాయిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవని చెప్పడంలో సందేహం లేదు. హీరోయిన్లను మించిన అందంతో.. ఎంతోమందిని ఆకట్టుకుంటుంది ఇక అలాగే రమేష్ బాబుకు కొడుకు కూడా ఉన్నారు. ఆయన పేరు జయకృష్ణ.. ఈయన కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా మహేష్ బాబు నటించిన జయం సినిమాలో నటించారు.
త్వరలోనే హీరోగా కూడా రాబోతున్నాడు అనే వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిజానికి రమేష్ బాబు మరణంతో ఈ పిల్లల బాధ్యతలను మహేష్ బాబు తీసుకున్నట్లు తెలుస్తోంది. సరైన కథ దొరికినప్పుడు ఒక మంచి దర్శకుడి దర్శకత్వంలో ఈ అబ్బాయిని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మహేష్ బాబు గౌతమ్ కృష్ణతో సమానంగా జయకృష్ణ ని కూడా చూసుకుంటూ ఉండడంతో ఆయన అభిమానుల సైతం మహేష్ బాబు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.