తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. నవ మన్మధుడిగా, కింగ్ నాగార్జున గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. సినీ కెరియర్ పరంగా ఆయన ఏ రేంజ్ లో దూసుకుపోతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఆరుపదుల వయసులో కూడా తన కొడుకులతో సమానంగా వారికే గట్టి పోటీ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్న నాగార్జున గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇకపోతే వైవాహిక జీవితంలో మాత్రం ఆయన ఎప్పటికప్పుడు కొంచెం వెనుకడుగు వేస్తున్నాడని చెప్పాలి.
మొదట దగ్గుబాటి వారసురాలు దగ్గుబాటి లక్ష్మీ ను వివాహం చేసుకొని , నాగచైతన్య జన్మించిన తర్వాత విడాకులు తీసుకొని అమలను వివాహం చేసుకున్నాడు.అలాగే టబుతో ప్రేమలో పడ్డాడని ఇప్పటికీ ఇదే కొనసాగుతోంది అని కూడా అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తుంటాయి. మరొక విషయం ఏమిటంటే శ్రియా తో కూడా నాగార్జున ప్రేమలో పడ్డాడు అని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. నాగార్జున అమలకు విడాకులు ఇచ్చి శ్రియాను పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ.. శ్రీయా పెద్దింటి కోడలు కాబోతోంది అంటూ వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అప్పటికే శ్రీయ తన బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ లో ఉంది అంటూ , వాళ్ళు శారీరకంగా కూడా ఒకటయ్యారు అంటూ వార్తలు రావడంతో, ఈ పెళ్లి ఆగిపోయిందనే వార్త కూడా వైరల్ అయింది.కానీ ఈ విషయాన్ని అటు నాగార్జున ఇటు శ్రీయ ఇద్దరు కూడా కొట్టి పాడేశారు. ఇక మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే కానీ తెరపై మా కెమిస్ట్రీ బాగుంటుంది .అంతేకానీ మేము రియల్ లైఫ్ లో భాగస్వాములము కావాలనుకోలేదు అంటూ తెలిపారు. ఇక శ్రేయ ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు అని నాగార్జున కూడా చెప్పుకు రావడం గమనార్హం.ఇక శ్రీయ కూడా ప్రస్తుతం ఒక బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.