అక్టోబర్ లో మొదలుకానున్న టి20 వరల్డ్కప్-2022కు ముందు ఈనెల 20 నుంచి జరగనున్న భారత్- ఆస్ట్రేలియా టి 20 సిరీస్ కు ముందే ఆస్ట్రేలియా కి గట్టి షాకే తగిలింది. ఆస్ట్రేలియా టీంలో కీలకమైన ముగ్గురు ప్లేయర్లకి గాయాల కారణంగా వారు ఈ సిరీస్ కి దూరమయ్యారు. టీం ఇండియాతో మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు ఇండియాకు రానున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా తన టీమ్ను ప్రకటించింది. ఈ టీంలో చోటు దక్కించుకున్న వారిలో మిచెల్ మార్ష్, మార్కస్ స్టొయినిస్, మిచెల్ స్టార్క్ చోటు దక్కించుకున్నారు. అయితే ఆ ప్రధాన ముగ్గురు ఆటగాళ్లకి గాయాల కారణంగా వాళ్ళు మ్యాచ్లకి దూరమయ్యారు ఇప్పుడు. వాళ్ళు స్థానంలో ఇతర ఆటగాళ్లు తీసుకున్నట్టు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ ప్రకటించింది.
టీమిండియాతో ఆడే ఆస్ట్రేలియా టీ 20 జట్టు వివరాలు :
ఆరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎలిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, కేన్ రిచర్డ్సన్, డేనియల్ సామ్స్, స్టీవ్ స్మిత్, మాథ్యూ వేడ్, ఆడం జంపా.