ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. నేటి యువతరాన్ని బాగా ఆకట్టుకున్న నటీమణులలో ఈమె కూడా ఒకరు. తెలుగు,తమిళ్ ,హిందీ వట్టి భాషలలో అనేక చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నది. 2014వ సంవత్సరంలో యమహా ఫాసినో మిస్ దివాలో ఫైనల్ వరకు చేరుకుంది. ఈ ముద్దుగుమ్మ 2017లో టైగర్ ఫ్రాష్ హీరోగా వచ్చిన మున్నా మైకేల్ అని చిత్రం ద్వారా మొదటగా తన కెరియర్ను మొదలుపెట్టింది. ఇక 2018లో చందు మండేటి డైరెక్షన్లో వచ్చిన సవ్యసాచి అనే చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది.
ఈ చిత్రంలో నాగచైతన్య సరసన హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక తర్వాత డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ. ఇక ఇందులో సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయం కావడంతో ఈమె కెరియర్ పరంగా పలు అవకాశాలు వెలుపడ్డాయి. అయితే చివరిగా ఈమె హీరో సినిమాలో మాత్రమే నటించింది.
కానీ ఆ తర్వాత ఎలాంటి అవకాశాలు రాలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల పిరియాడిక్ చిత్రంగా తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో పవన్ సరసన నటిస్తున్నది. ఇదంతా ఇలా ఉండగా ప్రస్తుతం నిధి అగర్వాల్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం ఒక స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తో నిధి అగర్వాల్ ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే వీరిద్దరూ మా మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని కొట్టిపారేశారు.. కానీ గతంలో కూడా ఈ ముద్దుగుమ్మ హీరో శింబు తో లవ్ లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. మరి ముద్దుగుమ్మ ఏ విషయంపై క్లారిటీ ఇస్తుందో చూడాలి.