అలనాటి ఆగ్ర నటుడు ఎస్. వీ. రంగారావు ప్రేక్షకులలో ఎంతటి జరగని ముద్ర వేసుకున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఆహార్యం, ఒడ్డు, పొడుగు అన్నీ చూస్తే ఎంతటి వాడికైనా భయం పుట్టాల్సిందే. ఇక ఎస్వీ రంగారావు ఏదైనా పాత్రలో నటిస్తున్నారు అంటే ఆ పాత్రకే మంచి గుర్తింపుని తీసుకొస్తారు. అలాంటి నటుడు తర్వాత తన వారసులను ఎందుకు సినిమాల్లోకి తీసుకురాలేదు అన్న అనుమానం కూడా ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. నిజానికి ఎస్వీ రంగారావు తన కొడుకును ఇండస్ట్రీలోకి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ఇక అందుకే ఎస్వీ రంగారావు తనయుడు కోటేశ్వరరావు హీరోగా సినిమా కూడా మొదలుపెట్టారు. కొంత షూటింగ్ చేసి తర్వాత సినిమాను మధ్యలోనే ఆపేయడం జరిగింది.
ఇకపోతే ఆ తర్వాత మళ్లీ ఆయన ఇంకొక సినిమాలో రావడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో ఎస్వీ రంగారావు కొడుకు జనరేషన్ సినిమాల్లోకి రాలేదు. కానీ మూడవ జనరేషన్ అయిన ఆయన మనవడు సినిమాల్లోకి వచ్చాడు. ఆయన రెండవ మనవడు ఎస్సీ రంగారావు కథానాయకుడిగా మిస్టర్ సెవెన్ అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యారు. 2012లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించకపోవడంతో ఆ తర్వాత ఆయన సినిమాలేవి చేయలేదు. ఆ టైంలో హీరో రంగారావు మాట్లాడుతూ .. తాతగారు మరణించి 37 సంవత్సరాలు అవుతోంది. ఆయన వారసులు ఎవరూ చిత్ర పరిశ్రమలో ప్రవేశించలేదని అనుకుంటున్నారు.. కొన్ని కుటుంబ కారణాల వల్లే నా సినీ ఎంట్రీ ఆలస్యమైంది. జూనియర్ ఎస్.వీ.ఆర్ సినీ కార్పొరేషన్ స్థాపించాము కానీ ఈ సంస్థ నుంచి ఏ సినిమా రాలేదు అని కూడా స్పష్టం చేశారు.
ఇకపోతే ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎస్వీ రంగారావు వంటి అద్భుతమైన నటుడు సినీ లోకాన్ని అత్యంత బాధాకరమని చెప్పవచ్చు.