వేణుమాధవ్ కి వున్న అమ్మాయిల పిచ్చే ఆయన ప్రాణం తీసిందా..?

మిమిక్రీ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన వేణుమాధవ్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే అన్నగారు మెచ్చిన కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వేణుమాధవ్. ఇకపోతే ఈయన నటించిన ఎన్నో సినిమాలు ఇప్పటికీ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నాయి అంటే ఇక ఈయన నటన ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అద్భుతమైన హాస్యాన్ని పండించి.. ఎన్నో మరుపురాని పాత్రలు కూడా చేశారు. ఇక అలా సుమారు 20 సంవత్సరాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన వేణుమాధవ్ 2019లో అకస్మాత్తుగా మరణించారు. ఇక అప్పటినుంచి ఆయన మరణం పై ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.వేణుమాధవ్ చివరి కోరిక తెలిస్తే కన్నీరు పెట్టుకుంటారుఇదిలా ఉండగా వేణుమాధవ్ భార్య, ఆయన కుమారులు ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణుమాధవ్ మరణించడానికి అసలు కారణం ఏంటో వివరించారు.. వేణుమాధవ్ చనిపోయిన బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు ఆయన మరణం తర్వాత వచ్చిన వార్తలు మరింత అసహనానికి గురి చేశాయి. ఇక వేణుమాధవ్ భార్య శ్రీవాణి ,కొడుకులు సావికర్, ప్రభాకర్ తరచూ ఇంటర్వ్యూ ఇవ్వడం.. అందులో ఆయన మరణానికి సంబంధించిన కారణాలు చెప్పడం వంటివి చేశారు. దీంతో ఎన్నో పుకార్లకు పుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు.Venu Madhav Height Weight, Age, Wife, Family, Wiki, Biography, Affair,  Profile

ఇంటర్వ్యూలో భాగంగానే వేణుమాధవ్ కొడుకులు మాట్లాడుతూ.. మేము ఏ రోజు వేణుమాధవ్ కొడుకులమని చెప్పుకోలేదు.. ఆయన ఎంత స్టార్ అయినా సరే మేము ఉపయోగించుకోలేదు అందరితోనూ మేము సాదాసీదాగానే ఉన్నాము.. నాన్నగారు ఇంట్లో చాలా ఆనందంగా ఉండేవారు. సినిమాల్లో కంటే ఇంట్లోనే ఎక్కువగా కామెడీ చేసేవారు. ఆయన ఏ రోజు మమ్మల్ని ఓ తండ్రిలా కొట్టడం , తిట్టడం చేసేవారు కాదు . మేమంతా ఫ్రెండ్స్ లానే ఉండేవాళ్ళం. ఇక ఆయన లేని లోటు మాకు బాగా కనిపిస్తూ ఉంది అంటూ బాధపడ్డారు.

నాన్న గురించి మా టీచర్లకు కూడా చెప్పేవాళ్లం కాదు.. ఆయన మా స్కూల్ కి వస్తామన్నా మేమే వద్దనే వాళ్ళము ..ఎందుకంటే నాన్నకు ఎక్కువ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు.. మా క్లాస్ లో కూడా ఆయనకి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పారు. అయితే ఇదంతా సరదాగా ఆయనకు అభిమానులుగా మారారు అంటూ తెలిపారు. నిజానికి వేణుమాధవ్ మరణానికి కారణం డెంగ్యూ ఫీవర్ అని సరైన జాగ్రత్త తీసుకోవడం వల్ల ప్రాణం మీదకు వచ్చింది..అందుకే ఆయన చనిపోయారు అంటూ అసలు విషయం బయట పెట్టింది వేణుమాధవ్ భార్య. అయితే వేణుమాధవ్ కి అమ్మాయిల పిచ్చి ఉంది.. అందుకే ఆయన ప్రాణాలు పోయాయి అనే పుకార్లన్నీ కేవలం ఆయన ఇమేజ్ ను డామేజ్ చేయడానికి మాత్రమే సృష్టించినవి..ఆయన చాలా మహోన్నతమైన వ్యక్తి అంటూ ఆమె వెల్లడించింది.