చలనచిత్ర పరిశ్రమంలో దారుణం చోటుచేసుకుంది. హీరోయిన్ ఫోన్ నెంబర్ ఇవ్వకపోతే ఓ సినిమా ఆటోగ్రాఫర్ భార్యను అత్యాచారం చేస్తానన్న ఓ మలయాళ దర్శకుడు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మలయాళ సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఎంఎస్ ప్రభు కు ఓ దర్శకుడు ఓ హీరోయిన్ నెంబర్ ఇవ్వకపోతే నీ భార్యని అత్యాచారం చేస్తానంటూ బెదిరింపులకు దిగాడట. ఆ దర్శకుడు బెదిరింపులకు భయపడి సినిమాటోగ్రాఫర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.
అసలేంఏం జరిగిందంటే… ఎంఎస్ ప్రభు… సీనియర్ సినిమాటోగ్రాఫర్ 30 సంవత్సరాల గా ఎన్నో సినిమాలుకు వర్క్ చేసుకుంటూ మలయాళీ చిత్ర పరిశ్రమంలో కొనసాగుతున్నాడు. ఆయనకు 2016లో సూర్య అనే దర్శకుడు పరిచయం అయ్యాడు. ఆ టైం నుంచి వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారారు. అప్పుడు ఆదర్శకుడు హీరోయిన్ పద్మప్రియ తో ఒక ట్రెడిషనల్ వీడియో సాంగ్ చేయాలని చెప్పి ప్రభు ను అడిగాడట..ప్రభు ఆ హీరోయిన్ ని ఒప్పించి ఆ డైరెక్టర్ తో ఆ సాంగ్ షూట్ చేయించాడు. కొన్ని రోజులు తరవాత ఆ డైరెక్టర్ పద్మ ప్రియ ఫోన్ నెంబర్ కావాలని ప్రభువును ఒత్తిడి చేయటం మొదలుపెట్టాడు. ఆ నెంబర్ నీకెందుకు అని ఇతను అడగగా. ఆ డైరెక్టర్ ప్రభువుపై దౌర్జన్యానికి దిగాడు. నువ్వు ఆ నెంబర్ ఇవ్వకపోతే నీ భార్యను అత్యాచారం చేస్తానంటు బెదిరించడం మొదలుపెట్టాడు.
ఆ డైరెక్టర్ అన్న మాటలకు భయపడిన ప్రభు వెంటనే దగ్గరలో ఉన్న రామాపురం పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేశాడు. ఆ డైరెక్టర్ పై వెంటనే చర్యలు తీసుకోండి అంటూ పోలీసుల్ని విన్నవించుకున్నాడు. ఇప్పుడు పోలీసులు ఈ కేసు పై విచారణ చేపట్టారు. హీరోయిన్ పద్మప్రియ ముందుగా టాలీవుడ్ లోనే పరిచయమైంది. టాలీవుడ్ లో శర్వానంద్తో కలిసి అందరి బంధువయ సినిమాలు నటించింది. తర్వాత ఆది పినిశెట్టితో కలిసి మృగం సినిమాలోో నటించింది. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమల అవకాశాలు దొరకపోవడంతో మలయాళీ సినిమా ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ సెటిల్ అయింది.