సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి ఈ గ్లామర్ ఫీల్డ్ లో నిలదొక్కుకోవాలి అంటే కచ్చితంగా క్లీవేజ్ షో చేయాల్సిందే.. అయితే కొంతమంది అవకాశాలు లేక మొత్తం చూపిస్తూ పాపులర్ అవుతుంటే.. మరికొంతమంది అవకాశాలు రాకపోయినా పర్లేదు పద్ధతిగా ఉంటాము అంటూ తమను తాము నిరూపించుకుంటున్నారు. గ్లామర్ ఫీల్డ్ అంటేనే అందాల ప్రదర్శన చేయాల్సిన పని లేకుండా ప్రతిభ ఉంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారు అంటూ నిరూపించడమే కాకుండా.. కోట్లు గుమ్మరించినా సరే ఎక్స్పోజింగ్ కి దూరం అంటూ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారు కూడా ఉన్నారు. మరి వారెవరో ఒకసారి చదివి తెలుసుకుందాం.
సాయి పల్లవి:ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఏకైక హీరోయిన్ అని చెప్పవచ్చు. స్కిన్ షో చేయలేదు కానీ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు నడుము , నాభి అందాలను చూపించలేదని చెప్పాలి. ఇకపోతే కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైనా సరే ఎక్స్పోజింగ్ కి నో చెబుతూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
కీర్తి సురేష్:తమిళ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా.. తెలుగులో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది .. కీర్తి సురేష్ కూడా తన నడుము, నాభి అందాలను చూపించడానికి ఏమాత్రం ఒప్పుకోదు. అంతేకాదు హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసినప్పటికీ స్కిన్ షో మాత్రం చేయలేదు.
నిత్యామీనన్:నిత్యామీనన్ కూడా స్కిన్ షో కి దూరం అంటూ కెరియర్ ఆరంభంలోనే తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఈమె పలు వెబ్ సిరీస్ లలో నటించినప్పటికీ స్కిన్ షో మాత్రం చేయడం లేదు.
ఇక ఇలా వీరంతా కూడా స్టార్ హీరోయిన్ లు అయినప్పటికీ కోట్లు గుమ్మరిస్తామని చెప్పినా ఎక్స్పోజింగ్ కి దూరంగా ఉంటూ తమను తాము నిరూపించుకుంటున్నారు.