సినీ ఇండస్ట్రీ అనే మాయా ప్రపంచంలో ఎప్పుడు ఎవరు చేతిలో ఎలా మోసపోతారో చెప్పడం చాలా కష్టం. ముఖ్యంగా కొంతమంది ప్రేమిస్తున్నామంటూ ఎంతోమంది ఆడపిల్లలను మోసం చేసి చివరికి వారిని శారీరకంగా వాడుకున్న తర్వాత కూడా వదిలేసిన వారు ఉన్నారు. కానీఅందులో కొంతమంది తట్టుకోలేక మానసిక ఒత్తిడి కి గురి అయ్యి ఆత్మహత్య చేసుకుని తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు
మరి సినీ ఇండస్ట్రీలో ముఖ్యంగా ప్రేమించి మోసపోయి ఆత్మహత్య చేసుకున్న వారెవరో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
1. మోనాల్:ప్రముఖ స్టార్ హీరోయిన్ సిమ్రాన్ చెల్లెలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మోనాల్ తమిళ కొరియోగ్రాఫర్ ను గాఢంగా ప్రేమించింది. అంతే కాదు అతడితో శారీరకంగా కూడా గడిపింది. కానీ అతడు ఒక సంవత్సరం పాటు ఆమెను వాడుకొని చివరికి మోసం చేశాడు. దీంతో దుఃఖం తట్టుకోలేక ఎవరికి చెప్పాలో అర్థం కాక చివరికి ఆత్మహత్య చేసుకుంది మోనాల్. తమిళ్ , తెలుగు, మలయాళం సినిమాలలో కూడా మంచి హీరోయిన్ గా పాపులారిటీని సొంతం చేసుకుంది.
2. ప్రత్యూష బెనర్జీ:చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా ప్రతి ఒక్కరికి పరిచయమైన ప్రత్యూష రాహుల్ రాజు అనే తోటి నటుడుతో ప్రేమలో పడి సహజీవనం చేసింది .వీరి ప్రేమకు గుర్తుగా ప్రత్యుష గర్భవతి కూడా అయింది అయితే రాహుల్ రాజు ప్రత్యూష తో ఉంటూనే మరొక అమ్మాయిని ప్రేమించడంతో ఆమె తట్టుకోలేక కడుపులో బిడ్డతో సహా ఉరివేసుకొని కన్నుమూసింది.
3. శోభ:సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన శోభ డైరెక్టర్ బాలు మహేంద్ర ను ప్రేమించి పెళ్లి చేసుకుంది .17 ఏళ్ళ వయస్సులో బాలు మహేంద్ర చేసిన మోసాన్ని తట్టుకోలేక ఆమె ఉరి వేసుకుని చనిపోయినట్టు తెలిసింది.
4. జియాఖాన్:జియా ఖాన్ ఒక అమెరికన్ మోడల్ .ఇండియాలో అవకాశాల కోసం కష్టపడకుండానే మంచి గుర్తింపు లభించుకుంది. ఇక ఈమె ఆదిత్య పంచోలి కుమారుడైన సూరజ్ పంచోలీ తో ప్రేమాయణం నడిపింది. అంతే కాదు కొన్నాళ్లపాటు సహజీవనం కూడా చేసింది.
ఇక గర్భవతి అయింది. కానీ బలవంతంగా అబార్షన్ చేయించాడు సూరజ్ .తర్వాత జియాని దూరం పెట్టాడు ఇక ఆ విషయాన్ని తట్టుకోలేక ఆమె తన బాధను ఒక లేఖ రూపంలో రాసి చివరికి ఆత్మహత్య చేసుకుంది.