టాలీవుడ్లో షూటింగులు బంద్ వల్ల పలు విమర్శలకు దారితీస్తున్నాయి. సొంత వర్గం నిర్మాతలు ఈ షూటింగ్లను బందుపై పెదవి విరుస్తూ ఉన్నారు. ఇద్దరు ప్రొడ్యూసర్లు మాత్రం తమవి తమిళ సినిమాలు అంటూ షూటింగులు పూర్తి చేసుకుంటున్నారు మిగతా వారివి మాత్రం తెలుగు సినిమాలే అంటూ ఆపివేయాలని చెబుతూ ఉండడంతో ఇండస్ట్రీలో కొంతమంది నిర్మాతలు హీరోలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ గిల్డ్ బందుపై.. స్టార్ ప్రొడ్యూసర్స్ అశ్వని దత్, బండ్ల గణేష్ విమర్శలు చేస్తున్నారు.అయితే తాజాగా వీళ్ల తరహాలోనే సీనియర్ హీరో రంగంలోకి దిగినట్లుగా తెలుస్తున్నది. ఆ హీరో ఎవరో కాదు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై డైరెక్టర్ గోపీచంద్ దర్శకత్వంలో బాలకృష్ణ ఒక భారీ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాని NBK -107 అనే టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ అని చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇటీవల కర్నూలులోని కొండారెడ్డి బూర్జువాక జరిగింది అక్కడ పలు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఇక ఇప్పుడు గిల్డ్ బంద్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది దీంతో బాలకృష్ణ కాస్త అసహనానికి లోనట్లుగా సమాచారం. ఈ సినిమా తర్వాత వెంటనే బాలకృష్ణ అనిల్ రావు ఫుల్ డైరెక్షన్లో ఒక సినిమాలో నటించడానికి సిద్ధమయ్యారు .ఈ సినిమాతో పాటు బాలయ్య అన్ స్టాపబుల్-2 ప్రారంభం కాబోతోంది. ఈ రెండు షెడ్యూల్ డిస్టర్బ్ కాకముందే మైత్రి మూవీ సినిమాలు పూర్తి చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు కానీ స్ట్రైక్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 9 లోపల తిరిగి షూటింగ్ మొదలు పెట్టాలని బాలయ్య నిర్మాతలకు సీరియస్గా చెప్పినట్లుగా సమాచారం. దీంతో బంద్ కు పిలుపునిచ్చిన కొంతమంది నిర్మాతలు ఆందోళనకు గురవుతున్నట్లుగా సమాచారం. ఇక బాలకృష్ణకు ఎదురు చెప్పే ధైర్యం ఏ ఒక్క ప్రొడ్యూసర్ చేయకపోవడం గమనార్హం. మరి మైత్రి మూవీ వారు ఎలా స్పందిస్తారో చూడాలి.