సౌండ్ చేయటానికి తప్ప పీకేదేమీ లేదు..ఈ డైలాగ్ వాళ్ళకే అంకితం..!!

దేవుడు ఉన్న చోటే దెయ్యం ఉంటుంది..మంచి ఉన్న చోటే చెడు ఉంటుంది..పాజిటివ్ కామెంట్స్ ఉన్న చోట నెగిటివ్ కామెంట్స్ కూడా ఉంటాయి. అలాంటి ఓ సో కాల్డ్ మహేశ్ యాంటి ఫ్యాన్స్ కు దిమ్మ తిరిగే కౌంటర్లు ఇస్తున్నారు..మహేశ్ బాబు అభిమానులు. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరో గా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన చిత్రం “సర్కారు వారి పాట”. గీతగోవిందం సినిమా ను తెరకెక్కించిన పరశూరామ్ ఈ సినిమా ను డైరెక్ట్ చేశారు. భారీ అంచనాల నడుమ నేడు ధియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమా మంచి పాజిటివ్ టాక్ అందుకుంది. సినిమాలోని పాటలు , యాక్షన్ సీన్స్, లావ్ ట్రాక్ లు బాగా వర్క్ అవుట్ అయ్యాయి.

సినిమా కధ పాతదే, మనం చాలా సినిమాలో చూసిన రివేంజ్ డ్రామా. కానీ, పరశూరామ్ సరికొత్త ఎలిమెంట్స్ తో కామెడి, లవ్ ను టచ్ చేస్తూ.. కూల్ గా లాకోచ్చేశాడు. సినిమా లో మహేశ్ నటన అదుర్స్. వన్ మ్యాన్ ఆర్మీ లా సినిమాని తన భుజాల పై నడిపించాడు. దానికి తమన్ మ్యూజిక్ తో సహాయం అందించాడు. దీంతో మహేశ్ ఖాతాలో మరో హిట్ పడిన్నట్లైంది. అయితే, ఈ సక్సెస్ ని జీర్ణించుకోలేని ఓ సోకాల్డ్ పావలా ఫ్యాన్స్ ..కావాలనే మహేశ్ సినిమా పై నెగిట్వీవ్ కామెంట్స్ రాస్తున్నారంటూ మహేశ్ అభిమానులు మండిపడుతున్నారు. తమ హీరో సినిమా దొబ్బెసింది అని.. మిగత హీరోల సినిమా పై ఇలాంటి ప్రచారం చేయడం సరికాదు అంటూ ఫైర్ అవుతున్నారు.

ఈ క్రమంలోనే సినిమాలోని డైలాగ్ ను వాడుతూ.. ఆ పావల ఫ్యాన్స్ బ్యాచ్ కి దిమ్మ తిరిగే కౌంటర్లు వేస్తున్నారు. “కరెన్సీలో పావలా విలువ ఎప్పుడో పడిపోయింది సార్,. ఆ బిళ్ళ సౌండ్ చేయటానికి తప్ప పీకేదేమీ లేదు. అని సర్కారు వారి పాట సినిమాలో చెప్పే డైలాగ్..”ని వాడుతూ..”ఈ డైలాగ్ నెగిటివ్ ట్రెండ్ చేస్తున్న పావలా ఫాన్స్ కి అంకితం” అంటూ సోషల్ మీడియా వేదిక గా గట్టి కౌంటర్ ఇస్తున్నారు. దీంతో మహేశ్ VS పావల ఫ్యాన్స్ బ్యాచ్ వార్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.