సినిమాల్లో నటించే హీరోయిన్లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసేందుకు తెగ ప్రయత్నిస్తుంటారు. అంతేగాక తమ స్టార్డమ్ను పెంచుకునేందుకు వారు అందాల ఆరబోతతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంటారు. ఈ క్రమంలో వారు చేసే అందాల విందు ప్రేక్షకులను మెప్పిస్తేనే వారికి మంచి కెరీర్ ఉంటుందనేది వాస్తవం. ఒకవేళ హీరోయిన్ల అందాల ఆరబోత ఏమాత్రం తేడా కొట్టిన వారిని జనం పట్టించుకోవడమే మానేస్తారు.
అయితే ఈ విషయంపై నటి తాప్సీ తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారియి. హీరోలతో సమానంగా క్రేజ్ ఉన్న హీరోయిన్లలో తాప్సీ కూడా ఒకరు. టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఇప్పుడు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా చలామని అవుతోంది. అయితే అక్కడి జనం హీరోయిన్లను పట్టించుకోవడంలో చాలా తేడా చూపిస్తారని ఆమె అంటోంది. హీరోయిన్ల అందాలకే అక్కడ ప్రాధాన్యత ఇస్తారని, అసలు హీరోయిన్లు అందాల ఆరబోత చేయకపోతే అక్కడ వారిని పట్టించుకునే వారే ఉండరని ఆమె అంటోంది.
దీంతో హీరోయిన్లు ఓవర్గా ఎక్స్పోజింగ్ చేస్తేనే అక్కడి ఆడియెన్స్ పట్టించుకుంటారని.. లేకపోతే వారికి ఇండస్ట్రీలో అవకాశాలు రావని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఎంతటి హీరోయిన్లు అయినా కూడా అక్కడి జనాలకు అందాల ఆరబోత చేస్తేనే వారు అక్కడ సక్సెస్ అవుతారని ఆమె అంటోంది. ఏదేమైనా ఇప్పుడు తాప్సీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.