పిచ్చ హ్యాపీగా ఉన్న సమంత..పిచ్చి బాగా ముదురిపోయిందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత..ప్రస్తుతం ఉన్న బడా హీరోయిన్లను సైతం వెనక్కి నెట్టి..నెం 1 హీరోయిన్ స్దానాని సంపాదించుకోవడానికి పరుగులు తీస్తుంది. పెళ్లికి ముందు..పెళ్లి తరువాత ఎలా ఉన్నా..విడాకుల తరువాత మాత్రం జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. మామూలు స్పీడ్ కాదండో..ఇటూ టాలీవుడ్..అటు బాలీవుడ్ మధ్యలో హాలీవుడ్ లో కూడా సినిమా లు చేయడానికి సిద్ధపడ్డింది. దీని బట్టి చూస్తుంటే విడాకుల తరువాత సమంత టైం బాగుందనే అంటున్నారు నెటిజన్లు.

కాగా, రీసెంట్ సమంత తన ఇన్స్టా వేదికగా..తనకు సంతోషానిచ్చే విషయం తనను ఇష్టపడే వ్యక్తులతో షేర్ చేసుకుంది. మనకు తెలిసిందే విడాకుల తరువాత సమంత డైరెక్ట్ గా కన్నా కూడా సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంది..తనకు సంబంధించిన విషయాలను తెలియజేస్తుంది. ఈ క్రమంలోనే తను చేసిన ఫస్ట్ ఐటేం సాంగ్..”ఊ అంటావా మావా..ఊ ఊ అంటావా మావా”..సాంగ్ మరో రికార్డ్ సృష్టించింది. దీంతో సమంత ఫుల్ హ్యాపీ అయిపోయి .. ఆ అభిమానులతో ఆ విషయాలను పంచుకుంది.

సుకుమార్‌- అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ సినిమా విడుదలైన నాలుగు నెలలు గడిచిన ఇప్పటికీ ఈ పాట క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఏ ఫంక్షన్ లో నైన..ఈ చిన్న పార్టీలో అయినా ఈ పాట ఉండాల్సిందే. కాగా రీసెంట్ గా అమెరికాలో జరిగిన ఓ మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో సమంత హాట్ హాట్ గా కనిపించిన ఊ అంటావా.. ఊ అంటావా పాట వినిపించడం అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ వీడియోని ఓ అభిమాని నెట్టింట పోస్ట్ చేయగా అది కాస్త సమంత కంట పడటం..ఆ విషయం పై ఆమె ట్వీట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. అస్సలు నమ్మలేకపోతున్నా.. అంటూ ట్వీట్ చేసింది. దీని పట్ల కొందరు సమంత అభిమానులు హ్యాపీగానే ఉన్నా..మరికొందరు అక్కినేని అభిమానులు మాత్రం ఆమెను ట్రోల్ చేస్తున్నారు. నీకు పిచ్చి ముదిరిపోయింది..అంటూ కొందరు..నీ పరువు నువ్వే తీసుకుంటున్నావ్ అంటూ మరికొందరు ఆమెను ఏకిపారేస్తున్నారు.