హీరాని వాడుకున్ని వదిలేసిన ఆ స్టార్ హీరో కొడుకు.. సర్వం అర్పించేసిందట..?

హీరా రాజగోపాల్..తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. అబ్బో అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది వాళ్ల ఫ్యాన్స్ కి. తన అందం ముందు ఏ హీరోయిన్ పనికి రాదు అంటుంటారు ఆమె అభిమానులు. అప్పుడెప్పుడో 1992 వ సంవత్సరంలో తెలుగులో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన అమ్మడు .. అతి తక్కువ టైంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. అమ్మడు అందానికి స్టార్ డైరెక్టర్లు కూడా ఫిదా అయ్యారు.

సీనియర్ దర్శకుడు సాగర్ డైరెక్షన్ లో భానుచందర్ పక్కన పబ్లిక్ రౌడీ అనే సినిమాలో హీరోయిన్ గా పరిచయమైన హీరా రాజగోపాల్..ఆ తరువాత నాగార్జున,బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసి భారీ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంది. యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన యువరత్న రాణా సినిమాలో కూడా ఆమె బాలయ్య పక్కన నటించింది. ఆ సినిమాలో ఆమె పాత్రకు మంచి పేరు కూడా వచ్చింది.

అయితే కెరీర్ పరంగా దూసుకుపోతున్న టైంలోనే టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ స్టార్ హీరో కొడుకుతో (ఆయన కూడా హీరోనే) ప్రేమలో పడింది. అప్పట్లో హీరా రాజగోపాల్ ప్రేమకథ ఓ సంచలనంగా మారింది. పెళ్లికి ముందే ఆ స్టార్ హీరో తో కలిసి ఒకే ఇంట్లో కూడా ఉన్నింది. ఒకానోక టైంలో అమ్మడు ప్రెగ్నేంట్ అని కూడా వార్తలు వచ్చాయి. ఇక రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రముఖ పత్రికా చానెల్ కూడా వార్తలు ప్రచూరింపబడాయి. కానీ, సీన్ కట్ చేస్తే..ఇద్దరు విడిపోయారు. ఇక్కడ మరో షాకింగ్ ఏమిటంటే..ఆ హీరో హీరాని కాకుండా..మరో హీరోయిన్ ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఇక దాంతో తీవ్ర మనస్థాపానికి గురై మద్యం సేవించడం, పొగతాగడం, వంటి చెడు అలవాట్లకు బానిసయిందని అప్పట్లో ఓ రేంజ్ లో వార్తలు వినిపించాయి.

ఆ టైంలో భారీ సినిమా ఆఫర్లు వచ్చినా అతనిని మర్చిపోలేక..మంచి మంచి ఛాన్సులు మిస్ చేసుకుందట. అప్పట్లో హీరా తన కష్టపడి సంపాదించిన డబ్బులంతా కూడా ఆ హీరో కోసమే ఖర్చు చేసిందట. సర్వం ధారపోసాక ఇలా నమ్మించి మోసం చేసిన ఆ హీరో పై పరోక్షంగా ఎన్నో ఇంటర్వ్యుల్లో తిట్టిపోసింది హీరా. కాగా ఇలాంటి బాధనుండి హీరా రాజగోపాల్ తన కుటుంబ సభ్యుల సహాయంతో కోలుకొని మళ్ళీ సినిమాలో నటించి.. బాగా సక్సెస్ అయ్యింది. ఇక ఆ తరువాత పుష్కర్ మాధవ్ అనే ఓ ప్రముఖ వ్యాపారవేత్త ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.