జర్నలిస్టు నోటి తీటకు దిమ్మతిరిగే సమాధానం చెప్పిన హీరోయిన్..

తెలుగు సినిమా జర్నలిస్టులు అప్పుడప్పుడు చేసే అతి వెగటు పుట్టిస్తుంది. వారి నోటి దూలకు నెటిజన్ల నుంచి చురకల అందుకునే పరిస్థితి. తాజాగా ఓ జర్నలిస్టు అడిగిన తీట మాటకు ఈడ్చి తన్నే సమాధానం చెప్పింది ఓ హీరోయిన్. చివరకు ఆ ప్రశ్న అడిగిన జర్నలిస్టు సారీ చెప్పి సరిపెట్టాడు. ఈ విషయం సోషల్ మీడియాకు ఎక్కాక ఊరుకుంటుందా? సదరు కలం వీరుడ్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు నెటిజన్లు. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

తాజాగా డీజే టిల్లు అనే సినిమా టీజర్ రిలీజ్ వేడుక జరిగింది. మీడియాను పిలిచారు. అక్కడ టీజర్ రిలీజ్ అయ్యాక పలువురు జర్నలిస్టులు నటీనటులను, దర్శకులను కొన్ని ప్రశ్నలు అడిగారు. వారు దానికి సమాధానం చెప్పారు. ఇంతలోనే ఓ జర్నలిస్టు తన నోటి గులను ప్రదర్శించాడు. ఈ టీజర్ లో హీరోయిన్ ను నీకు ఎన్ని పుట్టు మచ్చలున్నాయి అని అడుగుతాడు. అందుకు తను 16 అని చెప్తుంది.

ఈ విషయాన్ని చూసి ఓ జర్నలిస్టు హీరోయిన్ చేత 16 పుట్టు మచ్చలున్నాయని చెప్పించారు కదా.. రియల్ గా ఎన్ని ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారా? అని హీరోన అడిగాడు. దానికి హీరో సిద్దు మాత్రం ఈ ప్రశ్నను అవాయిడ్ చేద్దాం అని చెప్పాడు. కథ ఇక్కడితో అయిపోలేదు. హీరోయిన్ నేహా శెట్టి కన్నడ అమ్మాయి. తెలుగు సరిగా రాదు. కానీ తర్వాత ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. ఇంతకీ తను ఏమన్నాడో అడిగి తెలుసుకుంది. తను బాగా హర్ట్ అయ్యింది. ఇండస్ట్రీలో అందరికీ లేడీ ఆర్టిస్టులు అంటే చీప్ అనే భావన ఉంది. చివరకు జర్నలిస్టులకు కూడా అని ట్వీట్ చేసింది. ఈ ప్రశ్న దురద్రుష్టకరం. తన చుట్టూ పని చేసే మహిళలను, ఇంట్లో మహిళలను ఎంత గౌరవంగా చూస్తున్నాడో సింపుల్ గా చెప్పినట్లు ఉంది అని రాసుకొచ్చింది. వెంటనే సదరు జర్నలిస్టు సారీ చెప్పాడు. అయితా అతడిని తిట్టి పోస్తున్నారు జనాలు.