తప్పు చేస్తున్నావ్ పాప..వైరల్ గా మారిన శ్రీజ పోస్ట్..?

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న వాళ్ల లిస్ట్ ఎక్కువైపోయింది. తొందరపడి తీసుకుంటున్నారో..తప్పక తీసుకుంటున్నారో తెలియదు కానీ,వరుస పెట్టి బడా స్టార్స్ ఒకరి తరువాత ఒకరు విడాకులు ప్రకటిస్తూ..అభిమానులకు మైండ్ బ్లాకింగ్ షాక్ ఇస్తున్నారు. ఎవ్వరు ఊహించని విధంగా సమంత-నాగచైతన్య విడాకులు ప్రకటించి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరు నెలలు కావస్తున్నా కానీ ఈ మ్యాటర్ లో వేడి తగ్గలేదు.

ఇక ఆ తరువాత స్టార్ డాటర్ ఐశ్వర్య-కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా తమ 18 ఏళ్ళ వైవాహిక జీవితానికి ఎండ్ కార్డ్ పెట్టేశారు. వీళ్లు ఇలా విడాకులు తీసుకుంటారని అభిమానులు అస్సలు ఊహించలేదు. ఎందుకంటే మొదటి నుండి వీళ్లు చాలా అన్యొన్యంగా ఉండేవారు. ఇప్పటికి వీళ్లు ఎందుకు విడిపోవాలి అని అనుకుంటున్నారో రీజన్ తెలియదు. అయితే, వీళ్లిద్దరు డైవర్స్ అందరికి షాకింగ్ గా అనిపించాయి. ఇండస్ట్రీలో మరో విడాకులు మ్యాటర్ ఆన్ ది వే లో ఉంది..కానీ దాని పై అభిమానులు బాధపడటం కంటే కూడా ట్రోలింగ్ నే ఎక్కువ చేస్తున్నారు.

మనందరికి తెలిసిందే..చిరంజీవి చిన్న కూతురు శ్రీజ..తన మొదటి భర్తతో విడాకులు తీసుకుని రెండొ పెళ్లి చేసుకుంది. ఆయన తో ను ఓ పాపను కనేసింది. అయితే గత రెండు మూడు నెలలు మధ్య కూడా బాగానే ఉన్న ఈ జంట మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ సడెన్ గా శ్రీజ తన రెండో భర్తకి కూడా విడాకులు ఇవ్వడానికి సిద్ధపడిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీనికి తగ్గట్లే శ్రీజ కూడా భర్త ను దూరం పెడుతూ పోస్ట్లు పెడుతుంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇద్దరి కూతుర్లతో కలిసి దిగిన ఫోటోను ఇన్స్టా స్టోరీలో షేర్ చేసుకుంటూ లవ్లీస్ అని రాసుకొచ్చింది. అయితే దీని పై కొందరు నెటిజన్స్..స్పందిస్తూ..”తప్పు చేస్తున్నావు శ్రీజ..నువ్వు ఇలా విడాకులు తీసుకోకు..మీ నాన్న పరువు తీయ్యకు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీజకు నివ్రతీ, నవీక్ష అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీజ ప్రస్తుతం తన పిల్లలతో కలిసి సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తోంది.