పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా నిత్య మీనన్ – సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటించిన సినిమా భీమ్లానాయక్. మల్లూవుడ్లో హిట్ అయిన అయ్యప్పనుం కోషియమ్ సినిమాకు రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమాకు త్రివిక్రమ్ సంభాషణలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఇక ఈ సినిమా ఏపీ కన్నా నైజాంలో తొలి రోజు కుమ్మేసింది. నైజాంలో ఈ సినిమా ముందు నుంచి ప్రభుత్వం కూడా ఫుల్గా సపోర్ట్ చేస్తూ వచ్చింది.
రిలీజ్కు రెండు రోజుల ముందు యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్లో మంత్రులు కేటీఆర్ – తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్ హాజరయ్యారు. ఇక నైజాంలో ఇప్పటికే టిక్కెట్ రేట్లు కావాల్సిన కాడకు పెంచేసుకున్నారు. ఇక ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు విజ్ఞప్తి మేరకు ఐదో షో రెండు వారాల పాటు వేసుకోవచ్చు.
ఇక తొలి రోజే ఏకంగా రు. 12 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా రెండో రోజు ఏకంగా ఏడున్నర కోట్ల షేర్ నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. టాక్ కూడా బాగుండడంతో రెండో రోజు కూడా మంచి నిలకడను భీమ్లా ప్రదర్శించాడని చెప్పాలి. ఇక ఆదివారం కూడా మంచి వసూళ్లే రానున్నాయి. ఈ సినిమా నైజాంలో రు. 40 కోట్ల షేర్ రాబడితే బ్రేక్ ఈవెన్కు వస్తుంది.
రెండు రోజులకే రు. 20 కొట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా చాలా సులువుగా బ్రక్ ఈవెన్కు ఆవడంతో పాటు భారీ లాభాలు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.