ఆచార్య రిలీజ్ ప్లాన్… మ‌ళ్లీ మారింది.. మెగా ఫ్యాన్స్‌లో టెన్ష‌న్‌..!

మెగాస్టార్ చిరంజీవి – ఆయ‌న త‌న‌యుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో వ‌స్తోన్న ఆచార్య సినిమా గ‌త రెండున్న‌రేళ్లుగా షూటింగ్ జ‌రుపుకుంటూనే వ‌స్తోంది. అస‌లు ఈ సినిమా ఏ ముహూర్తాన మొద‌లు పెట్టారో కాని.. ఎప్పుడూ ఏదో ఒక అవాత‌రం ఎదుర‌వుతూనే వ‌స్తోంది. ముందుగా చిరు ప‌క్క‌న హీరోయిన్ సెట్ కాలేదు.. ఆ త‌ర్వాత చిరంజీవికి క‌రోనా రావ‌డం.. రామ్‌చ‌ర‌ణ్‌కు క‌రోనా ఎటాక్ కావ‌డం.. క‌రోనా రెండు సార్లు రావ‌డంతో షూటింగ్ అనుకున్న టైం కంటే చాలా లేట్ అయ్యింది.

అనుక‌న్న దానికంటే బ‌డ్జెట్ కూడా పెరిగిపోయింది. వ‌డ్డీలు పెరిగిపోయాయి. ఇక కొర‌టాల శివ కూడా ఎక్క‌డా రాజీప‌డ‌కుండా టేకింగ్ కోసం ఎక్కువ టైం తీసుకోవ‌డంతో ఆచార్య యేడాదికి పైగా లేట్ అయ్యింది. ఇక ఇప్పుడు కూడా రిలీజ్ అవుతుంది అనుకుంటోన్న టైంలో ఒమిక్రాన్ కేసుల భ‌యం సినిమాను వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు కూడా వ‌రుస పెట్టి పెద్ద సినిమాలు, ఇత‌ర భాష‌ల‌కు చెందిన పాన్ ఇండియా సినిమాలు వ‌స్తుండ‌డంతో ఆచార్య‌ను అనుకున్న టైకుం తీసుకు వ‌స్తారా ? రారా ? అన్న సందేహాలు అభిమానుల‌కు ఉండ‌నే ఉన్నాయి.

ఇక ఏప్రిల్ 1న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న‌ట్టు మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయాల‌ని ముందుగా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ రిలీజ్ పై మళ్లీ క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఆచార్య‌ను పాన్ ఇండియా రేంజ్లో కాకుండా కేవ‌లం తెలుగు, హిందీ భాష‌ల్లో మాత్ర‌మే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ వ‌రుస మార్పుల‌తో ఏప్రిల్ 1కు అయినా సినిమా వ‌స్తుందా ? అన్న సందేహాలు మెగా అభిమానుల్లో ఉన్నాయి.

గ‌తంలో చిరు న‌టించిన సైరా సినిమాను కూడా తెలుగుతో పాటు హిందీలో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆచార్య‌కు కూడా అదే రూల్ ఫాలో అవుతున్నారు. చిరు ప‌క్క‌న కాజ‌ల్ అగ‌ర్వాల్‌, చెర్రీకి జోడీగా పూజా హెగ్డే న‌టించిన ఈ సినిమాలో రెజ‌నీ క‌సాండ్రా స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించింది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది.