దాసరిని అవమానించిన మేకప్ మెన్.. తర్వాత ఎన్టీఆర్ ఏం చేశాడో తెలుసా..?

దాసరి నారాయణ రావు. తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర దర్శకుడిగా వెలిగిన వాడు. సినిమా పరిశ్రమకు ఏ కష్టం వచ్చినా.. తాను ఉన్నానంటూ ముందుకు వచ్చిన వ్యక్తి. ఆయన ఉన్నంత కాలం సినిమా పెద్దగా గుర్తింపు పొందాడు. సినీ జనాలకు వచ్చిన ఇబ్బందులను తొలగించాడు. అయితే తనకు సినిమాల్లోకి రావాలని కోరిక ఉన్నా.. తొలినాళ్లలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. ఇంతకీ తనకు ఎదురైన బాధాకర ఘటనలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

సుమారు 40 ఏండ్ల క్రితం.. తెలుగు సినిమా పరిశ్రమ అప్పుడప్పుడే గాడిలో పడుతోంది. పలు కుటుంబ, ప్రేమ కథా సినిమాలు వస్తున్నాయి. అప్పటి వరకు నాటకాలు వేసిన దాసరి.. తెలుగు సినిమా అవకాశం కోసం మద్రాసుకు వెళ్లాడు. అప్పుడే తనకు పెద్ద అవమానం జరిగింది. దాసరికి మేకప్ వేయడానికి ఒక మేకప్ మెన్ వచ్చాడు. దాసరిని చూసి.. ఏమిటయ్యా నువ్వు కూడా నటిస్తావా? అంటూ హేళన చేశాడు. మేకప్ కూడా సరిగా వేయకుండా నీ ఫేస్ కు యాక్టింగ్ కావాలా? అంటూ అవమానించాడు. ఆ మాటలతో తను నటన గురించి ఆలోచించడం మానేసి.. రచయితగా కెరీర్ ను మొదటు పెట్టాడు. ఆ తర్వాత దర్శకుడిగా మారి ఎన్నో సక్సెస్ లు అందుకున్నాడు.

అనుకోకుండా సినిమాల్లో నటించే అవకాశం దాసరికి వచ్చింది. స్వర్గం నరకం అనే సినిమాలో ఆచార్య అనే పాత్ర చేయాలనే ఆఫర్ వచ్చింది. అవకాశం అయితే వచ్చింది కానీ.. ఇంకా తనకు ఆ మేకప్ మెన్ మాటలే గుర్తుకు వస్తున్నాయి. అందుకే నటించ కూడదు అనుకున్నాడు. ఒకరోజు ఎన్టీఆర్ ను దాసరి కలిశాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ దాసరిని ఉద్దేశించి.. మీలో ఓ నటుడు ఉన్నాడు.. అని చెప్పాడు. దీంతో తనకు మళ్లీ నటించాలి అనే కోరిక కలిగింది. అప్పుడే స్వర్గం నరకం సినిమాలో ఆచార్య పాత్ర చేశాడు. మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించాడు దాసరి.