కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అంతం అవుతుందో అర్థం కావడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. కోట్లాది మందిని పొట్టన పెట్టుకుంది. ఎన్నో కుటుంబాలను రోడ్డు పాలు చేసింది. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి.
గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు, మరణాలు క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుండగా.. నిన్న పది వేలకు లోపుగా దిగజారాయి. యాక్టివ్ కేసులు కూడా గణనీయంగా తగ్గాయి. గత 24 గంటల్లో భారత్లో 8,488 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,45,18,901 కు చేరుకుంది. అలాగే నిన్నఒక్క రోజే 249 మంది కరోనా కోరల్లో చిక్కుకుని బలైపోగా.. దేశంలో కరోనా మరణాల సంఖ్య 4,65,911 కు పెరిగింది.
ఇక నిన్న ఆ మాయదారి మహమ్మారి నుంచి 12,510 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు దేశంలో 3,39,34,547 మంది హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే ప్రస్తుతం 1,18,443 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా కేరళ రాష్ట్రం నుంచే వస్తున్నాయి. తాజా కేసుల్లోనూ 5080 కేసులు అక్కడే నమోదు అయ్యాయి.