మొదటిసారిగా వారి పై స్పందించిన సమంత..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు తన జీవితంలో ఒక డెసిషన్ తీసుకొని వాటి వైపు అడుగులు వేసుకుంటూ తన పని తాను చేసుకుంటూ వెళుతోంది. తాజాగా సమంత కాశ్మీర్లో తన వెకేషన్ ని గడుపుతూ సోషల్ మీడియాలో వాటి ఫోటోలను షేర్ చేసింది. అయితే సమంత తన ప్రొఫెషనల్ లైఫ్ కాకుండా పర్సనల్ గా కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తోంది.

ఇలాంటి పనులు చేయడం వల్ల సమంత అభిమానులకు మరింత దగ్గరయింది. అయితే ఇప్పుడు సమంత మళ్లీ తన వంతు సహాయంగా కాశ్మీర్ కి చెందిన దూసల అనే చేనేత వస్త్రాల వారికి పలు సేవా కార్యక్రమాల కోసం అండగా నిలబడింది. అక్కడ ఉన్న కొన్ని రోజులు ఆ నేత దుస్తులు ధరించి అవి ఎలా ఉన్నాయో తనకి ఎలా అనిపించిందో అనే ఒక విషయంపై తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది.

ఈ దూసల నేత కార్మికులకు సపోర్ట్ చేసి అండగా నిలవాలని తన ఫాలోవర్స్ తో వారి కోసం పంచుకుంది. ఈ విధంగా సమంత చేయడంవల్ల అభిమానులు ఎంతగానో ఆనంద పడుతున్నారు.