అఖండ హీరోయిన్ కి కరోనా.. భయపడుతున్న బాలయ్య ఫాన్స్..!

టాలీవుడ్లోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తున్నప్పటికీ.. అందులో కొంతమంది మాత్రం హీరోయిన్ గా రాణించలేక పోతూ ఉంటారు.అలాంటి వారిలో హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ కూడా ఒకరు. ఇక ఏమి కంచె సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టగా. ఆ తర్వాత ఎన్ని సినిమాలు తీసింది అప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు. ఇక ఆ తరువాత కొన్ని సినిమాలలో ఐటెం సాంగుల్లో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.

ఇక ప్రస్తుతం బాలకృష్ణతో కలిసి అఖండ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈమె ఇప్పుడు తాజాగా కరోనా బారిన పడినట్లుగా ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఇక రీసెంట్ గా షూటింగ్ ముగించుకున్న బాలకృష్ణ ఫ్యాన్స్.. ఈ వార్త విని భయభ్రాంతులకు గురవుతున్నారు.

అయితే ఈమె నాకు సింప్టమ్స్ మాత్రమే ఉన్నాయి అన్నట్లుగా తెలియజేస్తోంది. కానీ వాటన్నిటినీ దాటుకొని త్వరలోనే మీ ముందుకు వస్తాం అన్నట్లుగా తెలియజేస్తోంది. ఇక బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం అఖండ. ఈ సినిమా కూడా సక్సెస్ కావాలని కోరుకుందాం .

https://twitter.com/ItsMePragya/status/1447096806844755976?s=20