సాయి ధరమ్ తేజ్ కు ఈరోజు ఆపరేషన్..?

హైదరాబాదులో మాదాపూర్ తీగల బ్రిడ్జి పైన శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు హీరో సాయి ధరమ్ తేజ్.అయితే ఇప్పుడు ఆరోగ్యం నిలకడగా ఉంది అన్నట్లుగా తెలియజేశారు అపోలో వైద్యులు. శరీరంలోపల ఎలాంటి రక్తస్రావం లేదన్నట్లుగా తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నారు.

ఇక సాయి ధరమ్ తేజ్ కు గుండెకు ఊపిరితిత్తులకు ఎలాంటి గాయాలు లేవన్నారు. ఇక చాతి పైన, కంటి పైన భాగం మాత్రమే బలంగా దెబ్బ తగిలినట్లు తెలియజేశారు.ఇక కాలర్ బోన్ విరగడంతో అందుకు శస్త్రచికిత్స చేసి సరి చేస్తామని వైద్యులు తెలియజేశారు. సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్య సిబ్బంది పరిశీలిస్తూనే ఉన్నారు.

ఇక నిన్న రాత్రి స్పృహలోకి వచ్చాడు సాయి ధరంతేజ్. సాయి ధరంతేజ్ అపోలో ఆస్పత్రిలో తన ఆరోగ్యం నిలకడగా ఉందని చికిత్సకు పూర్తిస్థాయిలో స్పందిస్తున్నారు వైద్యులు తెలిపారు.ఇదే నేపథ్యంలో “కాలర్ బోన్” ప్యాక్చర్ కావడంతో.. ఈరోజు దానికి శస్త్రచికిత్స నిర్వహించడం వైద్యుల నిర్ణయం తీసుకున్నారు.వైద్య పరీక్షలు అన్నీ చేసి ఈరోజు చికిత్స చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.