హీరోయిన్ త్రిష పై భగ్గుమంటున్న హిందూ సంఘాలు..!

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది త్రిష.ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈమె.అయితే ఈమె పై హిందూ నేతలు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.అది ఎందుకో ఏమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

దేవుళ్ళు విగ్రహాలు ఉన్న ప్రాంతానికి త్రిష చెప్పులు వేసుకుని వెళ్లడంతో హిందూ సంఘాల సైతం ఆమెపై ఫైర్ అవుతున్నారు.ఇక అంతే కాకుండా డైరెక్టర్ మణిరత్నం పై కూడా కేసులు నమోదు చేశారు.పూర్తి వివరాల్లోకి వెళితే..మణిరత్నం రూపొందిస్తున్న చిత్రం పొన్నియన్ సెల్వన్.ఈ సినిమాలో త్రిష ప్రధాన పాత్రలో నటిస్తోంది.

హీరోయిన్ త్రిష పై హిందూ సంఘం నేతల ఫైర్

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఇండోర్ లో జరుగుతోంది.ఇక శుక్రవారం కారు దిగి చెప్పులతో శివుడు గుడి ముందు నడుచుకుంటూ వచ్చిన సన్నివేశాలను చిత్రీకరించారు.అయితే హిందువులు పవిత్రంగా భావించే దేవాలయంలోకి.. త్రిష చెప్పులు వేసుకుని రావడంపై హిందూ సంఘాల నేతలు.. అంతేకాకుండా హీరోయిన్ డైరెక్టర్ పై కూడా కేసు నమోదు చేయడం జరిగింది.

ఏదిఏమైనా ఇటీవల కాలంలో మణిరత్నం పై కేసులు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి.