చైతూ క్లారిటీ ఇచ్చినా అదే కన్ఫ్యూషన్..సామ్ ట్వీట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అంటే గుర్తుకు వచ్చేది నాగచైతన్య, సమంతనే. లవ్ మ్యారేజ్ చేసుకున్న ఈ దంపతుల అనుబంధం ఎంతో అన్యోన్యంగా సాగుతూ వచ్చింది. చైతన్య సినిమా విడుదల అవుతుందంటే చాలు సమంత ఎంతో కేర్ తీసుకునేది. టీజర్,ట్రైలర్,సాంగ్స్ ఏవి విడుదలైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రచారం చేసేది.కాగా కొద్దిరోజులుగా నాగచైతన్య సమంత విడిపోతున్నారని టాలీవుడ్లో జోరుగా ప్రచారం వినిపిస్తోంది. ఈ జంట విడాకులు కూడా తీసుకుంటుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను అటు నాగచైతన్య సమంత గానీ చాలా రోజులపాటు ఖండించలేదు.

కాగా తాజాగా నాగచైతన్య ఈ విషయమై స్పందించాడు. నా గురించి, సమంత గురించి ఎందుకు ఇలా వార్తలు వస్తున్నాయో అర్థం కావడం లేదని నాగచైతన్య ఆవేదన వ్యక్తం చేశాడు. తాము విడిపోవడం లేదని క్లారిటీ ఇచ్చాడు.అయితే నాగచైతన్య క్లారిటీ ఇచ్చినా అభిమానుల సందేహాలు మాత్రం తీరడం లేదు. నిన్న లవ్ స్టోరీ సినిమా విడుదల కాగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా విజయం పట్ల పలువురు సెలబ్రిటీలు చైతన్య, సాయి పల్లవి శేఖర్ కమ్ములకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

పలువురు నటులు,దర్శకులు లవ్ స్టోరీ సినిమా థియేటర్ కు వెళ్ళి చూడాలని ట్వీట్ చేశారు. కానీ సమంత నుంచి ఎటువంటి ట్వీట్ కనిపించలేదు. మామూలుగా సమంత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ప్రత్యేక సందర్భాలు, సినిమాల విడుదల సమయంలో అందర్నీ విష్ చేస్తూ ఉంటుంది. అలాంటిది తన భర్త హీరోగా నటించిన లవ్ స్టోరీ సినిమా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ సినిమాకు సంబంధించి సమంత ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. ఇప్పటికైనా సమంతా స్పందించాలని ఆమె అభిమానులతో పాటు అక్కినేని అభిమానులు వేడుకుంటున్నారు.