సినిమాలు లేక అడవిబాట పట్టిన బ్యూటీ

టాలీవుడ్‌లో ‘అందాల రాక్షసి’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇక ఈ బ్యూటీ ఇటీవల ఏ1 ఎక్స్‌ప్రెస్ సినిమాలో నటించి సంగతి తెలిసిందే. ఆ సినిమా యావరేజ్ మూవీగా నిలవడంతో లావణ్య తీవ్ర నిరాశకు లోనైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో అప్పటి నుండి లావణ్య పెద్దగా బయట కనిపించడం లేదని, ప్రస్తుతం ఆమె అడవిబాట పట్టిందని తెలుస్తోంది.

ఈ వార్త విని లావణ్య త్రిపాఠి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే, ఆమె ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని ఓ ప్రశాంతమైన వాతావరణంలో ఉంటోంది. రొటీన్ జీవితానికి కాస్త బ్రేక్ ఇవ్వాలనే ఇలా ప్రశాంతతను వెతుక్కుంటూ ఉత్తరాఖండ్ అందాలను వీక్షించేందుకు అక్కడికి వెళ్లిందట ఈ బ్యూటీ. తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా ఈ మేరకు చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ఇక లావణ్య తనకు ఉన్న జబ్బు గురించి కూడా చెప్పుకొచ్చింది. కొన్ని ఆకారాలను చూస్తే తనకు భయంగా ఉందని, అందుకే అలాంటి వాటికి దూరంగా ఉండి, ఆ భయాలను పోగొట్టుకునేందుకే అక్కడికి వెళ్లినట్లు లావణ్య తెలిపింది.

ఏదేమైనా సిటీని వదిలేసి అడవిబాట పట్టిన లావణ్య కేవలం తన ప్రశాంతత కోసమే ఇలా చేస్తున్నానని చెప్పడంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఆమె నటించిన రెండు సినిమాలు తప్ప మరే ఇతర సినిమాలు లేకపోవడం కూడా ఆమె డిప్రెషన్‌కు కారణం అయి ఉంటుందని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఏదేమైనా లావణ్య త్వరగా మామూలు వ్యక్తిగా తిరిగి రావాలని ఆమె అభిమానులు కోరుతున్నారు.