కొత్త వివాదాల్లో చిక్కుకున్న శంకర్ ..

డైరెక్టర్ శంకర్.. ఎప్పటికప్పుడు వినూత్న ఆలోచనలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సినీ ప్రేక్షకులను అబ్బుర పరుస్తూనే ఉంటాడు. రోబో సినిమా తో ప్రేక్షకులను అలరించిన ఈయన ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాల్లో చిక్కుకున్న ఉన్నాడని సమాచారం గట్టిగా వినిపిస్తోంది. మొన్నటికి మొన్న కమెడియన్ వడివేలు తో వివాదాల్లో చిక్కుకున్న ఈయన నిర్మాత మండలి సహాయంతో కొంతవరకు ఊరట లభించింది. ఆ తర్వాత భారతీయుడు సినిమా సీక్వెల్ గా తీయడం కోసం ప్రముఖ స్టార్ హీరో కమల్హాసన్తో ఈ సినిమాను తెరకెక్కించాడు అయితే 60 శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా వివాదాల్లో చిక్కుకుని ఆగిపోయింది. ఈ సినిమా షూటింగ్ ఆరంభంలో క్రైన్ ఆక్సిడెంట్ జరగడంతో తిరిగి మళ్ళీ వివాదాలు తలెత్తాయి.

ఇకపోతే డైరెక్టర్ శంకర్ ఇప్పుడు సరికొత్త వివాదంలో చిక్కుకుని ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ సమస్య తీరనే లేదు శంకర్ రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో బాలీవుడ్‌లో అన్నీయన్ సినిమాను రీమేక్‌ చేస్తున్నట్లు శంకర్ ప్రకటించాడు.అయితే ఈ చిత్రం యొక్క అసలు నిర్మాత అస్కార్ రవిచంద్రన్ ఈ సినిమా రీమేక్ హక్కులు తన వద్దే ఉన్నాయని పేర్కొన్నాడు. కానీ అతని అనుమతి లేకుండా రీమేక్ ప్రకటించడం జరిగింది. దీంతో రవిచంద్రన్ కోపంతో, శంకర్ అలాగే సినిమా హిందీ నిర్మాత జయంతిలాల్ గదాపై దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి (SIFCC) కి ఫిర్యాదు చేశారు. అస్కార్ అవార్డ్ గ్రహీత రవిచంద్రన్ , ఇప్పుడు శంకర్ తోపాటు జయంతిలాల్ గదా లకు వ్యతిరేకంగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు ప్రకటించాడు.

దీనిపై శంకర్ అలాగే జయంతి లాల్ గదా లు సినిమా రీమేక్ రైట్స్ తమ వద్ద లేకుండానే , సినిమా ఎలా ప్రకటించారో ..పూర్తిగా స్పష్టం చేయాలని మద్రాస్ కోర్టు కోరింది.