తెలుగుదేశం పార్టీ నేత,మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ధూళిపాళ్ళ నరేంద్ర కేసులో ఏపీ హైకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సంగం డైరీలో అవకతవకలు జరిగిన సంగం డెయిరీ కేసులో అరెస్టైన తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర దాఖలు చేసిన పిటిషన్ల పై విచారణ చేపట్టింది హైకోర్టు. రిమాండ్ అంశం పై దాఖలైన పిటిషన్ను కొట్టి వేసింది హైకోర్టు.
అనిశా కోర్టు విధించిన రిమాండ్ పై హైకోర్టులో ధూళిపాళ్ల పిటిషన్ దాఖలు చేశారు. దీని పై విచారణ జరిపిన ధర్మాసనం తాజాగా ఆ పిటిషన్ను కొట్టి వేసింది. కేసు పై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని అవినీతి నిరోధక శాఖను హై కోర్ట్ ఆదేశించింది. తదుపరి విచారణను మే 5కు వాయిదా వేసింది హైకోర్టు.